భక్తి


ఇంతలో శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. అయితే సందేహం లేదు. ఇక్కడ చేరితే మూడు పూటలా భోజనం దొరుకుతుంది అనుకుని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువు. అయితే నాకు మూడు పూటలా భోజనం కావాలి అన్నాడు అయోగ్యుడు. నాయనా! చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమే ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు గురువుగారు. కాదుగురువుగారూ నేను ఆకలికి ఉండలేను అన్నాడు. సరే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అంటే సరేనన్నాడు. - ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా ఒక రోజు ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఉపవాసం ఉండాలి అన్నాడు గురువుగారు. అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారూ అన్నాడు. సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకు వెళ్ళి వండుకు తిను. కావాలంటే సరంజామా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు. సరేనని సరంజామా తీసుకున్నాడు శిష్యుడు. నాయనా వండిన ఆహారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే నువ్వు తినాలి. సరేనా అని గురువుగారు అనగా అలాగే గురువుగారూ అని వెళ్ళి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి ఇలా పిలిచాడు. రాజారామ్ ఆయీయే... రఘురామ్ ఆయియే... ముఛ్ భూక్ లగాయియే అంటూ పాడడం మొదలు పెట్టాడు. ఎంతకీ స్వామి రాడే... (ఇతని ఉద్దేశ్యంలో స్వామివారే స్వయంగా వచ్చి తింటారని అనుకుని ఎదురూ స్తూ ఉన్నాడు. అంతటి అమాయకుడు అయోద్యుడు. కపటం లేదు మనస్సులో) స్వామి ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి ఇలా అన్నాడు.


“దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు. ఇక్కడ ఏముంది? కుదిరీ కుదరని వంట తప్ప. అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావేమో స్వామీ.... ఈరోజు అక్కడ ఏమీ ఉండదు. ఏమీ పెట్టరు. ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు” అని మళ్ళీ పాడడం మొదలుపెట్టాడు. ఇదికూడా అయిపోతుందని. శ్రీ రాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతాసమేతంగా వచ్చాడు. శ్రీ రాముడిచూ శాడు సంతోషించాడు. కానీ పక్కనే సీత ఉంది. సీత వంక ప్రసాదం వంక పదే పదే స్తుండగా... శ్రీ రాముడు మేము వచ్చాము. సంతోషమేగా అంటే... అయోద్యుడు సీత వయా స్తూ ఆ ఆ సంతోమే. నాచేత ఇవాళ ఏకాదశి ఉపవాసం చేయించాలనుకున్నట్లు ఉన్నారు. రండి కూర్చోండి అని ఇద్దరికీ వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్ళిపోయారు. అయోద్యుడు ఆ రోజు ఉపవాసంతోనే ఉండిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు అయోద్యుడికి మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం, పప్పు దినుసులు ఇచ్చాడు. అప్పుడు గురువుగారూ ఇవి సరిపోవడం లేదండీ. ఇద్దరొచ్చారు. ఈసారి ఇంకాస్త కావాలి అంటే... వీడికి సరిపోతున్నట్లు లేదు. ఇంకో కేజీ ఇచ్చి పంపండి అని శిష్యులతో గురువుగారు చెప్పారు. యథావిధిగా అయోద్యుడు అక్కడికి వెళ్ళి వంట చేసి నైవేద్యం పెట్టి... మొన్న ఇద్దరు వచ్చారు కదా... అందుకని ఇలా పిలిచాడు. . రాజారామ్ ఆయీయే, సీతారాం ఆయియే, మేరా భోజనోకో భోగ్ ధరాయియే అంటూ పాడాడు. ఈసారి సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడి వంక, భోజనం వయా స్తుండగా.. శ్రీ రాముడు మేము వచ్చాము. నీకు సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక, భోజనం వంక చూ స్తూ ఆ సంతోషమే స్వామీ అంటూ ఈ వారం కూడా నాకు ఉపవాసమే అనుకుంటూ రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు. వారు ముగ్గురు తిని వెళ్ళారు. మళ్ళీ ఏకాదశి వచ్చింది. అయోద్యుడు గురువుగారితో ఇది కూడా సరిపోదండి. ముగ్గురు వచ్చారు అన్నాడు. వీడు రాత్రికి చూ కూడా తింటున్నాడేమో అనుకొని మరో కేజీ అదనంగా ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. ఈసారి పాట మార్చి పాడాడు. రాజారామ్ ఆయీయే, సీతారామ్ ఆయీయే, లక్ష్మణ్ సాథ్ ఆయీయే మేరా భోజనోకో భోగ్ ధరాయియే అంటూ పిలిచాడు. ఈసారి సీతారాములు లక్ష్మణుడు వచ్చాడు. వీళ్ళతో పాటు హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము. నీకు ఆనందమేగా అని అడిగారు. ఆ ఆ.. ఆనందమే అనుకుంటూ రండి కూర్చోండి అని వడ్డించాడు. అందరూ కూర్చుని తృప్తిగా తినేసి వెళ్ళిపోతుండగా స్వామీ ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? నేను వంట చేయడానికి అని అనగాశ్రీ రాముడు నవ్వి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడి వంక, భోజనం వయా స్తుండగా.. శ్రీ రాముడు మేము వచ్చాము. నీకు సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక, భోజనం వంక చూ స్తూ ఆ సంతోషమే స్వామీ అంటూ ఈ వారం కూడా నాకు ఉపవాసమే అనుకుంటూ రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు. వారు ముగ్గురు తిని వెళ్ళారు. మళ్ళీ ఏకాదశి వచ్చింది. అయోద్యుడు గురువుగారితో ఇది కూడా సరిపోదండి. ముగ్గురు వచ్చారు అన్నాడు. వీడు రాత్రికి కూడా తింటున్నాడేమో అనుకొని మరో కేజీ అదనంగా ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. ఈసారి పాట మార్చి పాడాడు. రాజారామ్ ఆయీయే, సీతారామ్ ఆయీయే, లక్ష్మణ్ సాథ్ ఆయీయే మేరా భోజనోకో భోగ్ ధరాయియే అంటూ పిలిచాడు. ఈసారి సీతారాములు లక్ష్మణుడు వచ్చాడు. వీళ్ళతో పాటు హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము. నీకు ఆనందమేగా అని అడిగారు. ఆ ఆ.. ఆనందమే అనుకుంటూ రండి కూర్చోండి అని వడ్డించాడు. అందరూ కూర్చుని తృప్తిగా తినేసి వెళ్ళిపోతుండగా స్వామీ ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? నేను వంట చేయడానికి అని అనగాశ్రీ రాముడు నవ్వి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు.


మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారూ ఈసారి రవ్వ 10 కిలోలు, బియ్యం 10 కిలోలు, పచారి 10 కిలోలు కావాలి అన్నాడు అయోద్యుడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా వాడు అడిగింది ఇచ్చి తరువాత ద్దాం ఏమి చేస్తున్నాడో అని శిష్యులతో వాడుఅడిగినవి ఇచ్చిపంపండి అన్నాడు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం అన్నీ 10 కిలోల చొప్పున ఇచ్చి పంపి గురువుగారి దగ్గరికి వచ్చారు. వీడు అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు. ఎక్కడ అమ్ముతున్నాడు? ఏ దుకాణంలో అమ్ముతున్నాడు? చూ ద్దాం పదండి అని గురువుగారితో సహా శిష్యులు అయోద్యుడి వెనుక బయలుదేరారు. ఎప్పటిలానే అయోద్యుడు చెరువు దగ్గరకు వెళ్ళి సామాను అంతా అక్కడ పడేసి చెట్టు క్రింద కూర్చుని రాజారామ్ ఆయీయే, సీతారామ్ ఆయీయే, లక్ష్మణ్ సాథ్ ఆయీయే, హనుమాన్ సాథ్ ఆయీయే మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అని పాట పాడాడు. ఈసారి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్, భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయిపరివారమంతా వచ్చారు. అయోద్యా మేము వచ్చేశాం. సంతోషమేగా... ప్రసాదం ఏది ఎక్కడుంది? అని అడిగాడు శ్రీ రాముడు. అప్పుడు అయోద్యుడు ఎప్పుడూ నేను వండితే మీరు తినేసి వెళ్ళిపోతున్నారు. కొద్దిగా కూడా ఉంచడం లేదు. నాచేత నాలుగు ఏకాదశి ఉపవాసాలు చేయించారు. ఈసారి మీరే వండండి. సామానంతా అక్కడ ఉంది అన్నాడుశ్రీ రాముడు నవ్వి సరేనని... కూరగాయలు కోస్తూ ఉన్నాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు. ఇలా అందరూ తలోపని చేస్తూ ఉండగా సీతమ్మ వంట వండుతోందని తెలుసుకొని దేవతలు, ఋషులు, గంధర్వులు వరుసగా వచ్చారు. కోలాహలంగా తయారయింది ఆ ప్రదేశం అంతా.. ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి అక్కడి సన్నివేశం స్తే సామాను అంతా పక్న పడేసి అయోద్యుడు చెట్టు క్రింద పడుకొని కనబడ్డాడు. వెంటనే గురువుగారు వచ్చి "అయోద్యా ఏమిటి సామానంతా అక్కడ పడేసి చెట్టు క్రింద పడుకున్నావ్” అనగానే అదేంటి గురువుగారూ సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ కలిసి వంట చేస్తున్నారుగా అంటే ఆశ్చర్యంతో ఎక్కడ... నాకేం కనబడడంలేదు” అన్నారు గురువుగారు. అయోద్యుడు శ్రీ రాముడిచూ సి మీరు మా గురువుగారికి కనపడడం లేదట. కనిపించండి. లేదంటే నామీద సందేహం వస్తుంది అనగాశ్రీ రాముడు అలాగే అని సపరివార సమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. గురువుగారు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అయోద్యుణ్ణి కౌగిలించుకుని ఎన్నో ఏళ్ళుగా పూజలు చేస్తున్నా నాకశ్రీ రామ దర్శన భాగ్యం కలుగలేదు. నీవు అమాయకంగా, నీ మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టే ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు. నీవల్ల మేము ధన్యులమయ్యాం అన్నాడు. భగవంతుడు రాడేమో అని, పూజలు ఎలా చేయాలి? ఎన్ని వత్తులు వేయాలి? అంటూ కొన్నాళ్ళు, విపరీత భక్తితో కొన్నాళ్ళు, విరక్తితో మరికొన్నాళ్ళు, చిరాకుతో ఏదో ఇష్టం వచ్చినట్లు గందరగోళంగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. చేయాలా వద్దా! ఎలా చేయాలి? ఈ రోజు పనులున్నాయి. ఈ రోజు మనసు బాగోలేదు ఇలా ఏదో వంకతో సాకుతో పూజలు ఎగొట్టేస్తూ ఉంటారు కొందరు. ఇలాంటివారికి జీవితాంతం గందరగోళం తప్ప భగవంతుడి సాక్షాత్కారం కలుగదు. పూజ గాని, జపం గాని, తపస్సు గాని, ధ్యానం యోగాదులు ఏదైనా సరే నిలకడ లేకుండా జీవితకాలం చేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సుతో చేస్తే తక్షణం పరమాత్ముడు దర్శనం ఇస్తాడు. ఏమాత్రం సందేహం లేదు. అయోద్యుడు, భక్తకన్నప్ప, భక్తతుకారాం ఈ కోవకు చెందినవారే. ఏమి పెట్టినా, ఎలా పెట్టినా మారు మాట్లాడకుండా స్వచ్ఛమైన, నిర్మలమైన భక్తికి వశమైపోయాడు.