ఆళ్వార్లు

 


ఆళ్వార్లు


                                                                                   - ఇలపావులూరి వేంకటేశ్వర్లు


భక్తి సాహిత్యంలో కీలక పాత్రను పోషించిన గాయక భక్తులు ఆళ్వారులు మరియు నయమ్మారులు కలిసి ఎన్నో మరుగున పడిపోయిన మహాపుణ్యక్షేత్రాలను వెలుగులోనికి తెచ్చారు. ఆళ్వారుల ద్వారా 10 శ్రీ హరి ఆలయాలు దివ్యదేశాలు అన్న గౌరవం దక్కించుకున్నాయి. అదేవిధంగా నయమ్మారులు 275 కైలాసనాథుడు కొలువుండే పవిత్ర ఆలయాలకు "పడాల్పెట్ర స్థలాలు" అన్న గుర్తింపు తెచ్చారు. అంతేకాకుండా తమపాటి కాలంలో పేర్కొన్న మరో 168 శైవ క్షేత్రాలకు "తేవరవైపు స్థలములు"గా అరుదైన గుర్తింపు తెచ్చారు. పరిపూర్ణ భక్తికి నిదర్శనం వీరు. అందుకే ఆలయాలలో కొలువైన వారిని ఆరాధిస్తున్నాము. వారు గానం చేసిన కీర్తనలను పాడుకొంటున్నాము.


ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీ తికరమైన మాసం. నాదముని ద్వారా మనకందించిన "నాలాయిర దివ్య ప్రబంధం"లో ఆళ్వార్లు గానం చేసిన 4,000 పాశురాలను విష్ణు ఆలయాలలో నియమంగా గానం చేస్తారు. ముఖ్యంగా ఆండాళ్ రచించిన తిరుప్పావై ప్రతినిత్యశ్రీ వారి సన్నిధిలో గానం చేస్తారు. తిరుప్పావై అంటే తిరుమ్మ నివాసునితి. ఈ కారణంగా తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతం బదులు స్వామివారిని తిరుప్పావైతో మేలుకొల్పుతారు. భక్తులు నాలాయిర దివ్య ప్రబంధాన్ని తమిళ వేదంగా పరిగణిస్తారు. ఆళ్వార్ అంటే నిరంతరశ్రీ హరి సేవలో నిమగ్నమైనవాడు అని అర్థం. అందుకే సుదర్శన చక్రాన్ని చక్రత్తి ఆళ్వార్ అని, గరుడుడిని గరుడాళ్వార్ అని పిలుస్తారు. అశాశ్వతమైన మానవ జన్మ ఎత్తిన ప్రాపంచిక ప్రలోభాలకు లోనవక జగద్రక్షకుడైన జగన్నాథుని తమహృదయ పీఠాలలో నిలుపుకొని ఆయన దివ్యచరితాన్ని, మహత్తును తమ పాశురాలుగా లోకానికి చాటినందున వీరు ఆళ్వారులుగా కీర్తించబడుతున్నారు. వీరికి పరమాత్మే తల్లి, తండ్రి, గురువు, సహోదరుడు, సఖుడు, మార్గదర్శి, ధన్వంతరి, పరమపదాన్ని ప్రసాదించే పరంధాముడు అన్నీ నీలమేఘశ్యాముడే. అనంతునికి సంబంధించినది ఏదైనా ఆళ్వారుకు అతి పవిత్రం, అమూల్యం, పూజనీయం. అందుకే తమ పాశురాలలోశ్రీ వారి రూపం, విగ్రహ సౌందర్యం, అలంకారం, దేవేరి, ఆయుధాలు, శేషపాన్పు, పాలకడలి, వైకుంఠం, భక్తవత్సలత, లీలావిలాసాలు ఇలా అన్నింటిని ఉదహరించారు. నిరంతరం హరినామస్మరణ చేస్తూ, పూజించుకుంటూ ఆళ్వార్ అన్న పదానికి పర్యాయంగా నిలిచారు.


ఆళ్వార్‌లో అగ్రవర్ణాల వారొక్కరే కాదు, నాటి సమాజంలోని అంటరానివారి దాకా అన్ని వర్ణాలకు, వర్గాలకు చెందినవారు ఉండటం విశేషం. జన్మతః లేదా పెరిగిన వాతావరణం వలన వర్ణవ్యత్యాసాలు ఏర్పడినాయి కానీ అందరూ అంతర్యామి ఆశీర్వాదంతో జన్మించినవారే.


ఆళ్వారులు ఒక మహిళతో కలిపి పన్నెండు మంది. పొయిగై అళ్వార్, భూతత్తి (పూతత్తి) ఆళ్వార్, పెయాళ్వార్, తిరుమలైసై ఆళ్వార్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, కులశేఖర ఆళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మరియు తిరుప్పాన్ ఆళ్వార్. అందరూ శ్రీ హరి పరమభక్తులే. అందరి పాశురాలూ సుమధురాలే. అయినా పన్నిద్దరిలో నమ్మాళ్వార్ మరియు ఆండాళ్ ప్రసిద్ధులు. నాలాయిర దివ్య ప్రబంధం మనకు అందించిన నాదముని నమ్మాళ్వార్ని ప్రార్థించే మొత్తం 4 వేల పాశురాలను పొందినది. ఈ నాలుగు వేలలో నమ్మాళ్వార్ గానం చేసినవే ఉంటాయి వెయ్యికి పైగా. పెరియాళ్వార్ దత్తపుత్రిక ఆండాళ్ (గోదాదేవి - భూమినుండి పుట్టింది)గా ప్రసిద్ధురాలు. ఈమె రచించినదే "తిరుప్పావై". ఈమెను భూదేవి అంశగా పేర్కొంటారు. కులశేఖర్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ ఇద్దరూ పాలకులు. తొండరడిప్పొడి ఆళ్వార్ విప్రనారాయణగా అందరికీ తెలిసినవారే. ఆళ్వారులలో ఒక్క తిరుమంగై ఆళ్వార్ మొత్తం 108 దివ్యదేశాలను సందర్శించారు. ఉత్తర భారతదేశంలోని దివ్యదేశాలను తొలిసారిగా దర్శించుకొన్నది మధురకవి ఆళ్వార్. మిగిలినవారు కొన్ని క్షేత్రాలను దర్శించి, మరికొన్నింటిని మనోదృష్టితో వీక్షించి, తరించి తద్వారా పొందిన రణతో మంగళ శాసనాలు గావించారు. తిరుప్పాన్ ఆళ్వార్ పది పాశురాలను మాత్రమే గానం చేశారు. వాటిల్లో రంగనాథుని రూప అలంకరణలను అద్భుతంగా వర్ణించారు. కారణజన్ములైన వీరు నేటికీ వైష్ణవ ఆలయాలలో కొలువై కనిపిస్తారు. మానవజన్మ అర్థం పరమార్థం మాధవసేవకే అన్న సత్యాన్ని లోకానికి చాటి చెప్పిన ఆళ్వారుల జీవిత విశేషాలు తెలుసుకుందాం. పొయి, ఆళ్వార్, భూతత్తి ఆళ్వార్, పెయాళ్వార్ ఈ ముగ్గురినీ మొదల్ ఆళ్వారులు అంటారు. పరమాత్మను కీర్తిస్తూ పాశురగానం చేయడం అన్నది వీరితోనే మొదలవడం వలన ఈ ముగ్గురినీ మొదటి ఆళ్వారులుగా పరిగణించారు. వీరు ఒక సమయంలో నేటి చెన్నె చుట్టుప్రక్కలే నివసించేవారు అని గ్రంథాలు తెలుపుతున్నాయి.


ముగ్గురూ ఎప్పుడైనా కలిశారా? అన్నదాని గురించి స్పష్టమైన సమాచారం ఏదీ లభించలేదు. కాని వీరి పరోపకారగుణం భగవత్సాక్షాత్కారం లభించేలా చేసింది అని తెలిపే ఒక గాథ ప్రచారంలో ఉన్నది. ఒకనాటి రాత్రి పొయిగై ఆళ్వార్ వెళుతుండగా వర్షం మొదలైంది. దగ్గరలో ఉన్న చిన్న కుటీరం బయట ఉన్న అరుగు మీద ఆయన శయనించారట. అర్థరాత్రి భీకరవాన బారిన పడకుండా ఆ మాత్రపు ఆశ్రయరూ "పిన లీలాస్వరూపుని స్మరించుకుంటూ ఉన్నారట. ఇంతలో భూతత్తి ఆళ్వార్ వచ్చి "వర్షంలో తడవకుండా కాస్త ఆశ్రయం ఇవ్వగలరా?" అని అడిగారట. "తప్పకుండా రండి. ఇక్కడ చక్కగా కూర్చోవచ్చు అన్నారట పొయ్చి. ఇద్దరూ కూర్చుని భగవన్నామస్మరణలో ఉండగా "వర్షం వెలిసేంతవరకు ఇక్కడ కూర్చోవచ్చునా?" అని అడిగారట అక్కడికి చేరుకొన్న పెయాళ్వార్. "నిస్సందేహంగా. ఇక్కడ ముగ్గురు కూర్చునేంత స్థలం ఉంది" అన్నారట లోపల ఉన్న ఇద్దరు ఆళ్వారులు. అలా ముగ్గురు కారుచీకటిలో హోరుమంటూ కురుస్తున్న వానలో ఒకరికొకయా డలేని పరిస్థితులలో ఆ కొద్దిపాటి స్థలంలో సర్దుకొని ఎవరి మానాన వారు, నివాసుని నామజపం చేసుకుంటూ ఉన్నారట. ఇంతలో "లోపలికి రావచ్చునా? వర్షంలో అవస్థ పడుతున్నాము" అన్నమాట వినిపించిందట. "ఒక్కక్షణం ఆగండి. నేను వెలుపలికి వస్తాను. తమరు లోనికి రావచ్చును" అని పలుకుతూ ముగ్గురూ ఒకేసారి బయటకు వచ్చారు. అంతే. వాన నిలిచిపోయింది. చల్లటి వెన్నెల, మెరుస్తూ నక్షత్రాలు కనిపించాయట. ఎదురుగా అద్భుత కాంతులీనుతూ శ్రీ వైకుంఠవాసుడు వారి ఎదుట సాక్షాత్కరించాడు. స్వార్థంతో నేను, నాది అని జీవిస్తున్న మనం ఈ సంఘటన నుంచి ఎంతో గ్రహించవలసి ఉన్నది.


పొయిగై ఆళ్వార్



సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచినది ఆలయాల నగరం కాంచీపురం. ఎన్నో శివ, విష్ణు ఆలయాలు ఉన్నాయక్కడ. వాటిలో ఒకటి "తిరువెక్క". యధోత్కరి పెరుమాళ్ళు కొలువైన ఈ ఆలయ పుష్కరిణిలోని పుష్పాల మధ్య కనిపించిన పసిబాలకుడే "పొయిగై ఆళ్వార్". పుష్పాల మధ్య జన్మించినందున అందరూ అలా పిలవసాగారు. ఆళ్వారుల పరంపరకు శంఖం పూరించి ఆద్యుడైన ఈయన నిరంతర శ్రీ వారి హస్తాలలో ఉండే శంఖం అయిన "పాంచజన్యం" అంశగా భావిస్తారు. పొయిగై ఆళ్వార్ గానం చేసిన 100 పాశురాలను "మొదలిరువందాది"గా పేర్కొంటూ నాలాయిర దివ్యప్రబంధం తొలి పుటలలో స్థానం పొందినది.



భూతత్తి ఆళ్వార్


పౌరాణికంగా, చారిత్రకంగా విశేష గుర్తింపు కలిగిన సాగరతీర ప్రాంతం "మామల్లపురం". అదే నేటి మహాబలిపురళీ మన్నారాయణుడు, వామనుడు బలిచక్రవర్తిని త్రివిక్రమరూపంలో పాతాళానికి పంపిన ప్రదేశమిదే అంటారు. ఈ పేరు వెనుక ఉన్న కథ అదే. పల్లవరాజుల కాలం నాటి ఆలయాలు, ఇతర నిర్మాణాలు ఈనాటికీ తమ శిల్పసౌందర్యంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్న దివ్యదేశం శ్రీ స్థల శయన పెరుమాళ్ కొలువైన "తిరుక్కాడమలై". స్వామి అనంతశయనుడు. ఆయన పూలకోసం సిద్ధం చేసిన పూలలో లభ్యమైనందున "పూదత్తి ఆళ్వార్"గా పిలిచేవారు. అదే భూతత్తిగా మారింది. తన జీవితాన్ని సంపూర్ణంగా సర్వాంతర్యామికి అంకితం చేసిన మహనీయుడుశ్రీ భూతత్తి ఆళ్వార్. ఎలాంటి ఆర్భాటాలు, హడావిడి, హంగామా లేకుండా అత్యంత సాధారణ జీవితం గడిపినవాడు. ఈయన గానం చేసిన 100 పాశురాలను "ఇరండం తిరువందాది"గా పేర్కొంటారు.



చెన్నె పట్టణంలోని శ్రీ కపాలేశ్వరస్వామి ఆలయం ఉన్న మైలాపూర్ చాలా ప్రసిద్ది. ఇక్కడే ఉంటుంది . ఆదికేశవ పెరుమాళ్" ఆలయం. ఆలయం పక్కన ఉన్న "మణికైరవైణి"గా పిలిచే బావిలో లభ్యమయ్యాడట శ్రీ వారి ఖడ్గం నందకం అంశతో జన్మించిన పెయాళ్వార్. చిన్నతనం నుండి పరంధాముని స్మరిస్తూ ఉండేవాడు. అద్భుత శక్తులను పొందాడు. తన దగ్గరకు వచ్చే ప్రజలకు భగవంతుని దర్శనం లేదా అనుగ్రహం పొందడానికి సూచించే విధానాలు ఆచరణ సాధ్యం కానివిగా తలచిన స్థానికులు ఆయనను పెయాళ్వార్ (పిచ్చి ఆళ్వార్) అని పిలిచేవారు. అలా ఆ పేరే స్థిరపడిపోయింది. "మూన్హామిరువందాది" గా ఈయన గానం చేసిన పాశురాలను సంకలనం చేశారు. మొదల్ ఆళ్వారులు అయోనిజులుగా జన్మింశ్రీ హరి సేవే తమ జీవితాలకు సార్థకత అన్న ఒకే ఒక్క భావనతో ఎలాంటి ప్రచార పటాటోపం లేకుండా గడిపారు. తదనంతర ఆళ్వారులు భిన్నమైన మార్గాలలో సమాజానికి తమ ఉనికిని పెద్దయెత్తున చాటారు. వారిలో కొందరు తాత్కాలికంగా మానవ సహజమైన వ్యామోహాలకు లోనై పెరుమాళ్ దయతో తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. ఎందరికో మార్గదర్శకులైనారు.



కాంచీపురానికి సమీపంలోని "తిరుమలై " అనే గ్రామంలో నివసించేవారు భార్గవ ముని దంపతులు. సంతానాన్ని అపేక్షిస్తూ యాగం చేయగా కాళ్ళు చేతులు లేకుండా చలనం లేని శిశువు జన్మించాడు. ఆ పసివానిని మృతసమానునిగా భావించి వెదురు పొదల వద్ద వదిలేశారు. అలా పడివున్న బిడ్డను స్వయంగా మహాలక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు చేరదీసి అవయవ ప్రదానం చేశాడు. చలనం పొందిన పసివాడినా సిచేరదీశాడు "తిరువాలన్". బిడ్డలు లేని ఆయన మగా సాకి అన్ని విద్యలలో శిక్షణ ఇప్పించాడు. కాని కారణజన్ముడైన తిరుమలైసై అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించినా, ఆధ్యాత్మిక వేదాంత విషయాల పట్ల మక్కువ పెంచుకుని భక్తిమార్గం వైపు మళ్ళాడు.


ఈయన సతతంశ్రీ వారి హస్తాలలో ఉండే సుదర్శన చక్రం అంశగా చెప్తారు. తిరుమలైపై లభించిన తరువాత "కణికన్నన్" అనే కుమారుడు జన్మించాడు. అతను కూడా అన్న దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకొని ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించాడు. మరో విషయం ఏమిటంటే తిరుమలై మొదట శివభక్తుడు. పెయాళ్వార్ ఉపదేశాలతోశ్రీ వైష్ణవునిగా మారాడు. అతని అచంచల విష్ణుభక్తిహ సి ప్రజలు "భక్తిసారుడు" అని పిలిచేవారు. ఈయన కొంతకాలం కాంచీపురం లోని తిరువెక్క అనే దివ్యదేశంలో నివసించారు.శ్రీ యధోత్కరి పెరుమాళ్ "ని నియమంగా కొలిచేవారు. ఆ సమయంలో ఆయనకు కావలసినవి అందించేది ఒక వృద్ధురాలు. ఆమె నిస్వార్థ సేవకు సంతసించిన తిరుమలైసై ఆమె కోరిక మేరకు సుందర యువతిగా మార్చారు. ఆసౌందర్యరాశియా సిమోహించిన రాజు వివాహమాడాడు.


సంవత్సరాలు గడిచిపోయాయి. రాజును వృద్ధాప్యం కబళించసాగింది. కాని రాణి సౌందర్యం ఏమాత్రం మారలేదు. కాలం ఆమె మీద ఎలాంటి ప్రభావం పలేదు. రాజు రాణిని ప్రశ్నించగా తిరుమలైసై విషయం తెలిసింది. ఆయనను పిలిపించిన రాజు తనమీద కూడా ఎలాంటి ప్రభావం లేకుండా చేయమని ఆదేశించాడు. ఆయన నిరాకరించడంతో తిరుమలైసైని రాజ్యము నుండి బహిష్కరించాడు. ఆయన వెళ్ళిపోతూ యధోత్కరి పెరుమాళ్ ను "నేనుండని రాజ్యములో నీకు పని ఏమి? నాతోరా" అన్నారు. భక్తసులభుడు ఆదిశేషునితో పాటు భక్తుని కోరిక మేరకు అతనిని అనుసరించాడు. వారు వెళ్ళిపోవడంతో రాజ్యమంతా చీకట్లు ఆవరించాయి. ప్రజలు తల్లడిల్లిపోయారు. తిరుమలైసై రాజ్యం విడిచిపోవడమే దీనికి కారణమని గుర్తించిన రాజు వెళ్ళి తన తప్పును క్షమించమని, తిరిగి రాజ్యానికి రమ్మని ప్రార్థించాడు. ఈ సంఘటనకు గుర్తుగా తిరువెక్క దివ్యదేశంలోని యధోత్కరి పెరుమాళ్ వ్యతిరేక దిశలో అంటే కాళ్ళు ఆదిశేషుని పడగల క్రింద పెట్టి ఎడమ చేతిమీద శయనించి దర్శనమిస్తారు. నాటినుండి స్వామివారిని "సున్నవినంసైద పెరుమాళ్" (చెప్పినది చేసే పెరుమాళ్ )గా పిలువసాగారు భక్తులు. కంచి, కుంభకోణం మరియశ్రీ రంగాలలో నివసిస్తూ ఎన్నో కీర్తనలు రాశారు. వాటిలో ఉన్నతమైనవే భావితరాలకు అందాలన్న కోరికతో కీర్తనలను రాసిన తాళపత్రాలను కావేరీ ప్రవాహంలో వదిలేశారు. ఒడ్డుకు తిరిగివచ్చిన 120 పాశురాల సంకలనం "తిరుచ్చెండవిరుదం" మరియు 90 పాశురాల "నాన్ముగం తిరువందాది" మనకందించారు.



తిరునల్వేలి జిల్లాలోని పక్క పక్క దివ్యదేశాలైన "తిరుకురుగూర్" (ఆళ్వార్ తిరునగరి) మరియు "తిరుక్కోలూరు" లకు చెందిన వారు ఈ ఇద్దరు గురుశిష్యులు. తనకన్నా వయసులో చిన్నవాడైనా అతనిలో తనకు కనిపించిన దైవత్వాన్ని గమనించిన మధురకవి ఆయనను గురువుగా స్వీకరించారు. సంప్రదాయకుటుంబంలో జన్మించిన మధురకవి సంస్కృత తమిళ భాషలలో చక్కని ప్రావీణ్యంతో పాటు ఆధ్యాత్మిక భావాలు కలిగిన మధుర కవి. ఉత్తర భారతదేశంలోని అయోధ్య, మధుర ఆదిగా గల దివ్యదేశాలను దర్శించిన తొలి ఆళ్వార్. ఆయన అక్కడ ఉండగా దక్షిణ దిశలో ఆకాశంలో ఒక అద్భుత కాంతిపుంజం దర్శనమైంది. అది ఒక శుభపరిణామానికి చిహ్నం అని అర్థం చేసుకున్న ఆయన దానిని అనుసరించి తిరుకురుగూరు చేరుకున్నాడు. అక్కడ చింతచెట్టు తొర్రలో మౌనదీక్ష స్వీకరించి ధ్యానంలో ఉన్న "మారన్"మా డగానే ఆకర్షితుడయ్యాడు. కారణజన్ముడని అర్థం చేసుకున్నారు. ఆయన గురించి మరింత తెలుసుకోవాలని "సేంతిన్వయట్రిల్సిరియాదు పిరండల్ ఏతం తిండ్రు ఎంగేకిడక్కుమ్" (దేహంలోని చిన్నజీవి (ఆత్మ) ఆ దేహం మరణిస్తే ఏమి తింటుంది? ఎక్కడ ఉంటుంది?) దానికి పుట్టిన తరువాత మొదటిసారి పలికిన "ఏతంతిండ్రుఅంగేకిడక్కుమ్" (ఏమి తినాలో అదే తింటుంది. అక్కడే ఉంటుంది) అన్నారు మారన్. ఈ ప్రశ్న సమాధానాలలో గొప్ప అర్థం ఉన్నది. మధుర కవి పరమాత్మను చేరే మార్గం గురించి ప్రశ్నించగా మారన్, అది ప్రాప్త కర్మల మీద ఆధారపడి ఉంటుంది అని తెలిపారు. అలా వారి గురుశిష్యబంధం ఆరంభమైంది. మధురకవి తన గురువును కీర్తిస్తూ పదకొండు పాశురాల "కన్నినిన్ సిరుతతిర,,ంబు" గానం చేశారు. ఈయన విష్వక్సేనుని సహచరుడైన "కుముద గణేశ" అంశగా చెబుతారు. ఇవే కీర్తనలను కొన్నివేల సార్లు అదే చింతచెట్టు క్రింద స్మరించి నమ్మాళ్వార్ దర్శనం మరియు అందరు ఆళ్వారులు గానం చేసిన పాశురాలను పొందారు నాదముని. ఆళ్వార్ల అందరిలోకి ప్రసిద్ధుడు నమ్మాళ్వార్.


ఈయశ్రీ మహావిష్ణువు సర్వసేనాధిపతి అయిన "విష్వక్సేనుని" అవతారంగా విశ్వసిస్తారు. పుట్టినప్పటినుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిరంతర ధ్యానంలో ఉండే పిల్లవాడిని ఆలయం వద్ద వదిలేశారట. తల్లితండ్రులు పెట్టిన పేరు మారన్. శఠగోపన్ అని కూడా పిలుస్తారు. విష్ణు ఆలయాలలో భక్తులకు పెట్టే శఠారి ఈయన పేరుమీద వచ్చిందంటారు. ఈయన పాశురాలకు ముగ్ధులైన ప్రజలు మగా నమ్మాళ్వార్ (మన ఆళ్వార్) అని పిలుచుకునేవారు. అదే స్థిరపడిపోయింది. చింతచెట్టు తొర్రలో నిరాహారంగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకొన్నారు. తొలిసారి మాట్లాడింది. మధురకవితోనే. తిరుకురుగూర్నుండి బయటికి వెళ్ళింది లేదు. తన దివ్యదృష్టితో అనేక క్షేత్రాలను సందర్శించి వెయ్యికి పైగా పాశురాలను గానం చేశారు. మధురకవి వాటినన్నిటినీ గ్రంథస్తం చేశారు. నమ్మాళ్వార్ పాశురాలను తమిళ వేదాలుగా కీర్తిస్తారు. అవే "తిరువిరుతం" (ఋగ్వేదం), తిరు అశిరియం (యజుర్వేదం), పెరియ తిరువందాది (అధర్వణవేదం), తిరువాయ్మూంజి శ్రీ వైష్ణవ వేదసారం). నమ్మాళ్వారు తపస్సు చేసిన చింతచెట్టును నేటికీ తిరుకురుగూరు దివ్యదేశంలో డవచ్చును. ఇక్కడ మధురకవికి తన గురువు ఆదేశం మేరకు తమిర పారాణి నది నీటిని తెర్లబెట్టడం ద్వారా లభించిన నమ్మాళ్వార్ లోహమూర్తిని కూడా వీక్షించవచ్చును.


తిరుకురుగూర్ (ఆళ్వార్ తిరునగరి శ్రీ వైష్ణవ నవగ్రహాల క్షేత్రాలలో గురుక్షేత్రం, తిరుక్కోలూరు నవగ్రహ క్షేత్రాలలో అంగారక క్షేత్రం. తమిరపారాణి నదీతీరంలో నవ తిరుపతులు మరియు నవ కైలాసాల పేరిట తొమ్మిది విష్ణు మరియు తొమ్మిది శివాలయాలు ఉంటాయి. మధురకవి ఆళ్వార్ రచించిన కన్నినిన్ సిరుతంబు అన్న పాశురాలను నాదముని ఆళ్వార్ తిరునగరిలోని చింతచెట్టు క్రింద కొన్నివేల సార్లు పఠించి నమ్మాళ్వార్ దర్శనం పొంది, మొత్తం 12 మంది ఆళ్వారులు గానం చేసిన నాలుగువేల పాశురాలను పొందారు. వాటిని ఆయన నాలాయర దివ్యప్రబంధం పేరు మీద మనకందించారు.



సుప్రసిద్ధ పుణ్యక్షేత్రశ్రీ విల్లిపుత్తూరులో శ్రీ మన్నారాయణుని వాహనమైన గరుడుని అంశతో జన్మించారు పెరియాళ్వార్ గా ప్రసిద్ధులైన విష్ణుచిత్తుడు. అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. సదా విష్ణుచింతనలో ఉండేవారు. అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువును అలంకరించడానికి ప్రత్యేకంగా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. చక్కని పూలదండలతో శ్రీ వటపత్రశాయి పెరుమాళ్ ని అలంకరించి సంతృప్తి చెందేవారు. పెరుమాళు పెరియాళ్వారుతో సంభాషించేవారని చెబుతారు. పాండ్యరాజు ఏర్పాటు చేసిన వేదాంత సభల్లో పాల్గొని వేదాంతసారం, పరమాత్మతత్వం, మానవజన్మ పరమార్థం గురించి వివరించి గొప్ప సన్మానం పొందారు. దానిని వీక్షించడానిశ్రీ వారు సకల దేవతలతో వచ్చి ఆకాశవీధులలో నిలిచారట. అదూ సి పెరియాళ్వార్ ఆయన దివ్యమంగళ రూపానికి ప్రజల దృష్టి తగులుతుందని భయపడుతూ గానం చేసిన "తిరుపల్లాండు" మరియు "పెరియ ఆళ్వార్ తిరుమూళి" రెండు మధుర పాశురాలు సంకలనాలు.



సాక్షాత్బూదేవి అంశ. జనక మహారాజుకు జానకీదేవి లభించినట్లు. పెరియాళ్వార్ పెరుమాళ్ అలంకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన నందనవనంలో పూలమొక్కల క్రింద లభించింది. __మానురాగాలతో ఆమెను పెంచసాగారు. పెరియాళ్వార్. చిన్నతనం నుండి తండ్రి చెప్పినశ్రీ కృష్ణుని దివ్యగాథలు విని ఆయననే తన భర్తగా భావించుకోసాగింది. తనను తాను ఒక గోపికలాగా, బృందావనంలో గోపీ మనోహరునితో విహరిస్తున్నట్లుగా ఊహించుకోసాగింది. ఊహలలోనే కాదు, నిజ జీవితంలో కూడా తాను ఆయనకు తగిన వధువునా కాదా అన్నది తేల్చుకోవడానికి తండ్రి కట్టే దండలను ధరించుకొని చూ సుకుని మురిసిపోయేది. ఆమె ఆనాడు ప్రతిబింబం చూ సుకున్న కన్నాడి (అద్దం) బావి నేటికీశ్రీ విల్లిపుత్తూరులోని ఆలయంలోచూ డవచ్చును. తెలియక పెరియాళ్వార్ ఆ దండలశ్రీ వటపత్రశాయి పెరుమాళ్ కి సమర్పించుకొనేవాడు. ఈ కారణంగా ఆమెకు ఆముక్తమాల్యద అన్న పేరు వచ్చింది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ పేరుతోశ్రీ ఆండాళ్ చరిత్రను తెలుగులో రచించారు.


ఒకనాడు దండలో కనిపించిన శిరోజానిచూ సి అది తన కూతురిదని గ్రహించిన పెరియాళ్వార్ ఇంతకాలం ఆమె ధరించిన దండలను స్వామివారికి సమర్పించినందుకు వగచినాడు. దండలు ఆలయంలో ఇవ్వలేదు. అదేరోజు రాత్రి శ్రీ రంగనాథుడు కలలో కనిపించి తనకు ఆండాళ్ ధరించిన దండలే ఇష్టమని తెలిపి, తాను ఆమెను వివాహం చేసుకుంటానని తెలిపాడు. ఇదే విషయాన్ని పాండ్యరాజుకు స్వప్నంలో కనిపించి ఆండాళ్ కొరకు పల్లకీ పంపమని సందేశాన్ని ఇచ్చాడు. రాజు శ్రీ రంగం నుంశ్రీ విల్లిపుత్తూరుకు పల్లకీ పంపాడు. ఆనందంగా వచ్చిన గోదాదేవి గర్భాలయంలోనిశ్రీ రంగనాథునిలో ఐక్యం అయిపోయింది. ధనుర్మాసంలో వచ్చే భోగినాడు గోదా కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ఈమె గానం చేసిన తిరుప్పావై ధనుర్మాసంలో అన్ని విష్ణు ఆలయాలలో నియమంగా గానం చేస్తారు. ప్రతి దివ్యదేశంలోనే కాదు అన్ని వైష్ణవ ఆలయాలలో ఈమె రచించిన పాశుర సంకలనం "నాంచారీ తిరుమూళి". శ్రీ విల్లిపుత్తూరు దివ్యదేశం ఆండాళ్ తో ముడిపడి ఉన్నది.



చేరరాజ వంశంలో జన్మించిన కులశేఖర ఆళ్వా శ్రీ హరి కౌస్తుభ అంశగా పేర్కొంటారు. గొప్ప యోధుడు.ఎన్నోయుద్ధాలలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని విస్తరించాడు.ఈయన ఆరాధ్యదైవం శ్రీ రామచంద్రుడు. ఆయన్ని ఆదర్శంగా చేసుకొని ప్రజలను చక్కగా పరిపాలించాడు. దశరథ నందనుని మీద అమిత మ. మరియు భక్తి. ఎంతగా అంటే సీతాపహరణం దాకా రామాయణం విని, జానకీమాతను అపహరించిన రావణుని మీద యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసేంత. బిడ్డమీద తల్లికి ఎలాంటి మ, అనురాగం మరియు ఆప్యాయత ఉంటాయో అలాంటిదే కులశేఖరుడశ్రీ రాముని పట్ల కలిగి ఉండేవాడు. ఈ అచంచల వాత్సల్యపూరిత భక్తిని ఆయన తన పెరుమాళ్ తిరుమూళిలో సుందర లలితమైన పదాలలో తెలిపారు.



సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు విప్రనారాయణ. వేద వేదాంగాల అధ్యయనం, భాషా పాండిత్యంలో కృషి చేసిన విప్రనారాయణశ్రీ రంగనాథుని అలంకరణ నిమిత్తం ఒక చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేశాడు. ఈ కారణంగానే కామోసు ఈయన వైజయంతిమాల అంశ అని అంటారు. ప్రతినిత్యం పూలను సేకరించి స్వామికి అలంకరించి ఆనందపడటం విప్రనారాయణ దినచర్య. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అందగాడు అయిన విప్రనారాయణ దేవదాసి దేవదేవి పన్నిన మాయలో పడి ఆమెకు దాసుడైపోయాడు. అతనిని తిరిగి భక్తిమార్గంలోకి మళ్ళించడానికి పరమాత్మ పన్నిన పన్నాగమో మరొకటో చెయ్యని దొంగతనానికి చెరసాల పాలయ్యాడు విప్రనారాయణ. అక్కడ తన తప్పు తెలుసుకున్నాడు. క్షమించి కరుణించమని కమలాక్షుని వేడుకున్నాడు. ఆ నిజం తెలుసుకున్న రాజు ఆయనను విడుదల చేశాడు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తార్థంశ్రీ వైష్ణవ గురువుల పాదపూజ చేసి, వారి పాదధూళిని శిరస్సున ధరించి తొండరడిప్పొడి ఆళ్వారుగా ప్రసిద్ధి చెందాడు. "తిరుమలై" మరియు "తిరుపళ్ళిమళుచ్చి" అనే పాశుర గ్రంథాలతో తొండరిడిప్పొడి ఆళ్వారు విష్ణుభక్తికి నిదర్శనంగా నిలిచాయి.



దివ్యదేశాలలో అగ్రస్థానం పొందిన శ్రీ రంగం కావేరీనదికి ఒక ఒడ్డున ఉండగా మరో ఒడ్డున ఉంటుంది చోళరాజుల ఒకప్పటి రాజధాని మరియు ఒక దివ్యదేశం అయిన ఉరయూరు. ఆ ప్రాంతానికి అన్నదాత కావేరి. అలాంటి సస్యశ్యామల భూమిలో వరికంకుల మధ్య "మాతాదాసు" (మాలదాసరి | బాణర్) అనే అంటరాని కులానికి చెందిన వ్యక్తికి లభించాడు బోసి నవ్వులు చిందించే పసిబాలుడు. సంతతి లేని మాతాదాసు బాలుని మగా పెంచాడు. అప్పట్లో ఈ కులం వారికి ఆలయ ప్రవేశమే కాదు కావేరీ నదిలో స్నానం కూడా నిషేధమే. కాని ఆలయ ఉత్సవాలలో, ఊరేగింపులలో వీరు ఉండవలసిందే. శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ కీర్తనలను పాడటంలో వీరు నేర్పరులు. మానవులు దూరం పెట్టినా మధురమైన గళం ప్రసాదించి దగ్గరకు చేర్చుకున్నాడు పరమాత్మ. తనకు పుష్ప పత్రి అర్చన కంటే గాత్రార్చపైపై తికరమని పెరుమాళ్ ఈ విధంగా తెలియజెప్పాడు. చక్కని స్వరంతో మధురంగా హరికీర్తనలు గానం చేస్తూ నిరంతరం వీణ ధరించి కనపడటం వలన తిరుప్పానన్ అని పిలిచేవారు. ప్రతిరోజు ఉషోదయానికి ముందే కావేరి ఒడ్డున నిలిశ్రీ రంగ విమానం వైచూ సుశ్రీ రంగనాథుని కీర్తిస్తూ, తనకెప్పటికైనా ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించే భాగ్యం ఉన్నదా అని బాధపడుతుండేవాడు. కాని అతని సమక్షం ఆలయ పూజారులకు కంటగింపుగా ఉండేది. తమ మడి ఆచారాలు అతని వలన మంటకలుస్తున్నాయన్న వంకతో ఒకనాడు అతని మీద రాళ్ళు విసిరారు. తలపైన గాయం అయి బాధతో పక్కకు తప్పుకున్నాడు తిరుప్పానన్. పూజారులు ఆలయానికి చేరుకుచూ డగా తిరుప్పానన్ కి ఎక్కడైతే గాయం అయిందో అక్కడే మూలవిరాట్టుకు రక్తస్రావం అవుతూ కనిపించింది. నిర్ఘాంతపోయారు వారు. నాటి రాత్రీ రంగనాథుడు ఆలయ ప్రధాన పూజారి సారంగనాథునికి స్వప్నంలో కనిపించి తనకు రక్తం కారడానికి కారణం తెలిపి తిరుప్పానన్ ని తన సమక్షానికి తీసుకొని రమ్మన్నాడు. పరంధాముని ఆనతి మేరకు వెళ్ళిన సారంగనాథుడు ఎంత బ్రతిమాలినా భయంతో రానన్న తిరుప్పాననను బలవంతంగా తన భుజాల మీద కూర్చోబెట్టుకుని గర్భాలయం చేరుకున్నాడు. ఎంతో కాలంగా ఎదురుస్తున్న క్షణం రావడం కనులముందు ఆరాధ్య దైవ రూపం. ఆనందాన్ని అణచుకోలేని తిరుప్పానన్ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేసి సశరీరంగా శ్రీ రంగనాథునిలో ఐక్యం అయ్యాడు. ధన్యజీవి తిరుప్పానన్ ఆళ్వార్. ఈయన గానం చేసిన పది పాశురాల సంకలనాన్ని శ్రీ అమలానంద పిరన్" అంటారు.



శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వార్ల పరంపరలో ఆఖరివాడైన తిరుమంశ్రీ వారి ధనుస్సు అయిన సారంగి అంశ అంటారు. తల్లితండ్రులు పెట్టిన పేరు కలియన్లేదానీలన్. గొప్ప యోధుడు. చోళరాజుల సైన్యాధిపతి. రాజాభిమానం సంపాదించి అల్లినాడు ప్రాంతానికి సామంతరాజుగా నియమితుడయ్యాడు. తిరుమంగైని రాజధానిగా చేసుకొని పాలించడం వల్ల తిరుమంగై అని పిలువబడినాడు. ఆస్థాన ధన్వంతరి కుమార్తె అయిన కుముదవల్లిహి సి మోహించాడు. అతనిని వివాహం చేసుకోవడానికి శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఆమె కొన్ని షరతులను విధించింది. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించాలని, నిత్యం వందమంది వైష్ణవుల పాదపూజ చేయాలని, అదేవిధంగా ప్రతిరోజు 1008 మంది విష్ణుభక్తులకు భోజనం పెట్టాలని. అన్నింటినీ అంగీకరించి కళ్యాణం చేసుకున్నాడు. ఆనాటినుండి ఏనాడూ మాట తప్పలేదు. మహారాజుకు చెల్లించవలసిన కప్పాన్ని కూడా దానధర్మాల క్రింద ఖర్చు చేశాడు. మహారాజు నుండి తాఖీదులు రావడంతో ఈ ధనం చెల్లించడానికి దారి దోపిడీలకు పాల్పడ్డాడు. పెరుమాళ్ మారువేషంలో వచ్చి అతను అనుసరిస్తున్న మార్గం సరైనది కాదని తెలిపి అష్టాక్షరీ మంత్రం ఉపదేశించాడు. తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే భువిలో ఉన్న 106 దివ్య దేశాలను సశరీరంగా సందర్శించారు. అక్కడ కొలువై ఉన్న నీలమేఘశ్యాముని కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశురాల్ని గానం చేశాడు. ఈయన ఆధ్వర్యంలోనే శ్రీ రంగ ఆలయ ప్రాకారాల నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. నిష్కల్మష హృదయం, నిర్మల భక్తితో నారాయణ అంటే చాలు, ఆదుకొనే ఆదిదేవుడుశ్రీ మన్నారాయణుడు. ఈ విషయాన్ని తమ భక్తి పాశురాల ద్వారా తెలిపిన ఆళ్వారులు అందరికీ మార్గదర్శకులు. -


శ్రీ మన్నారాయణ