తిరునల్వేలి దివ్యదేశాలుకాంచీపురం తరువాత ఎక్కువ సంఖ్యలో శ్రీవైష్ణవ దివ్య తిరుపతులు ఉన్న మరో జిల్లా తిరునల్వేలి. జిల్లాలో మొత్తంగా పది దివ్యదేశాలు

కాంచీపురం తరువాత ఎక్కువ సంఖ్యలో శ్రీవైష్ణవ దివ్య తిరుపతులు ఉన్న మరో జిల్లా తిరునల్వేలి. జిల్లాలో మొత్తంగా పది దివ్యదేశాలు ఉన్నాయి. తమిళనాడు దక్షిణ భాగాన మదురై, కన్యాకుమారి, రామేశ్వరం మరియు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మధ్యలో ఉంటుందీ జిల్లా, రాష్ట్రంలో ఆరో పెద్ద నగరంగానూ, దక్షిణ భాగాన ముఖ్య వ్యాపార కేంద్రంగా ప్రసిద్ది తిరునల్వేలి పట్టణం.


త్రవ్వకాలలో లభించిన వస్తువుల ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల క్రిందట నుండి జనజీవనం, నాగరికత వెల్లివిరుస్తోందని తెలిపారు. తిరునల్వేలి జిల్లా పర్యాటకులకు కావలసిన అన్ని రకాల ఆకర్షణలను కలిగి ఉన్నది. పురాతన కట్టడాలు, విశేష ఆలయాలు, పర్వతప్రాంత విడిది కేంద్రాలు, అభయారణ్యాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇరవై ఒక్క చిన్నా పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో తమిర పారాణి నది, దాని ఉపనది అయిన చిత్రానది ముఖ్యమైనవి. తిరునల్వేలి నగరం మరియు ముఖ్య ఆలయాలు పర్యాటక కేంద్రాలు తమిరపాణి నదీ తీరంలోనే ఉంటాయి. నగరంలో శ్రీవినాయక, శ్రీవరదరాజ, శ్రీ అయిరతాంబాల్ ఆలయాలు సందర్శనీయాలు. అద్భుతమైన శిల్పాలు, సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలతో పాటు మరెన్నో విశేషాల నిలయం అయిన శ్రీ కాంతిమతీదేవి సమేత శ్రీ నెల్లియప్పార్ ఆలయ సందర్శన మరిచిపోలేని అనుభవం. శ్రీ నెల్లియప్పార్ కొలువైనందునే ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. తమిళనాడులో ఉన్న అయిదు నాట్యసభలలో రెండు ఈ జిల్లాలలో నెలకొని ఉన్నాయి. శ్రీ నెల్లియప్పార్ ఆలయంలో ప్రత్యేక కలపత రమణీయంగా మలచిన శిల్పాలతో దర్శనమిచ్చేది తామసభ.


నవ కైలాసాలుగా పిలువబడే తొమ్మిది విశేష శివాలయాలు మరియు శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలుగా పేరొందిన తొమ్మిది దివ్యదేశాలు ఈ జిల్లాలో తమిరపారాణి నదీ తీరంలో ఉండటం మరెక్కడా కనిపించని విశేషంగా పేర్కొనవచ్చును. ఇంకా జిల్లాలో తెన్ కాశి శ్రీకాశీ విశ్వేశ్వర ఆలయం. శంకరన్


కోవిల్, కృష్ణాపురం శ్రీ మేళ వేంకటాచలపతి ఆలయం. ఆరుపాడై వీధుల్లో సముద్ర తీరంలో నెలకొన్న ఒకే ఒక్క క్షేత్రం తిరుచ్చెందూరు ముఖ్యమైనవి. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. జిల్లా మొత్తం పర్వతాలు పచ్చని అడవులతో నిండి ఉన్నందున ప్రకృతి విశ్వరూపాన్ని కనులారా వీక్షించవచ్చును. పాపనాశనం, బాణతీర్థం, కుర్తాళం ఎన్నో జలపాతాలకు నిలయాలు. ముఖ్యంగా కుర్తాళంలోనే చిత్రానది ఎనిమిది జలపాతాల రూపంలో నేలకు జాలువారుతుంది. శ్రీ కుర్తాళ్ నాథర్ కొలువైన ఈ క్షేత్రం మరో నాట్యసభ. వందల సంవత్సరాల క్రిందట సహజ వర్ణాలతో చిత్రించిన శివలీలా చిత్రాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఈ చిత్రసభ ప్రత్యేకత. ఈ జలపాతాల నీటిలో వేలాది వనమూలికల సారం ఉన్నదని తెలియడంతో ఎందరో నరాల బలహీనత, చర్మవ్యాధుల, పక్షవాత రోగులు నియమంగా ఈ జలపాతాల నీటిలో స్నానం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో జులై నెలలో ఎనిమిది రోజుల పాటు "సరళ విళ” అన్న పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. లక్షలాది మంది ప్రజలు ఈ సందర్భంగా ఇక్కడికి వస్తుంటారు. కుర్తాళంలో తప్పక చూడాల్సినది “మౌనస్వామి” (కుర్తాళ పీఠం) అశ్రమం. పాపనాశనం కూడా ఎన్నో జలపాతాలకు నిలయం. బాణతీర్థం, అగస్త్య జలపాతాలు మరియు శ్రీ అగస్త్య మహర్షి ఆలయం ఇక్కడి ఆకర్షణలు. కుర్తాళం సమీపంలో పంచ ధర్మశాస్త్ర ఆలయాల్లోని అచ్చం కోయిల్ మరియు ఆరియంగావు కలవు. శ్రీ కుమారస్వామి కొలువైన మరో విశిష్ట తిరుమలై కుమారస్వామి ఆలయం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. కొద్దిగా వెనక్కి వెళ్ళి నవ కైలాసాల మరియు నవ తిరుపతుల గురించి తెలుసుకొందాము. నవ తిరుపతులు అన్నీ తూర్పు వైపున ఉంటాయి. నవ కైలాసాలు కొన్ని పడమర వైపు, మిగిలినవి తూర్పువైపున ఉంటాయి. ఎంతో పౌరాణిక ప్రాశస్త్యం కల నవ తిరుపతులు ఇవి. శ్రీవైకుంఠం, తిరువరగుణ మంగై, తిరుప్పులింకుడి, తిరుకుళందాయ్, తిలుతులై బ్లిం మంగళం. తెందురుపెరయ్, తిరుక్కోలూర్, తిరుకుగునూర్. , వీటిలో తిరుకుగునూర్ (ఆళ్వారు తిరునగరి) పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వారు జన్మస్థలం. ఈయన కృపవలననే నాదముని “నళయర దివ్యప్రబంధం” లోకానికి అందించారు. తిరుక్కోలూరు నమ్మాళ్వారు శిష్యుడైన మరో ఆళ్వారు అయిన మధురకవి జన్మస్థలం. జిల్లాలో ఉన్న మరో రెండు దివ్యదేశాలు అయిన "తిరుక్కురన్ గుడి మరియు వనమామలై" కన్యాకుమారికి వెళ్ళే దారిలో ఉన్నాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తంగా పది దివ్య తిరుపతులు కలవు. ఇక నవ కైలాసాలు “పాపనాశనం, చేరన్ మహదేవ, కొడకనల్లూరు, కున్నత్తూరు, మూరప్పన ఆడు, శ్రీవైకుంఠం, తెందురుపెరయ్, రాజపతి, ఛందమంగళం” ఈ తొమ్మిది స్థలాలు


నయన్మారులు గానం చేసిన పాటికాల కారణంగా "పడాల పేట్రస్థలాలు”గా గుర్తింపు పొందాయి. . తిరునల్వేలి జిల్లాలో గల ముందతురాయ్, కాలకాడు ప్రముఖ తిరునల్వేలి జిల్లాలో గల ముందతు అభయారణ్యాలు. వన్యప్రాణి సంరక్షక కేంద్రాలు. పెద్దపులి, చిరుతపులి లాంటి క్రూరమృగాలతో పాటు అంతరించిపోతున్న అనేక జాతుల పక్షులు, అడవి జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. కూద్దకుళం అనేక రకాల దేశ విదేశ పక్షుల నివాసం. మణిమత్తూరు జలపాతం వద్ద నిర్మించిన ఆనకట్ట సమీపంలోని "మనోజోలామ్” పర్వత ప్రాంత విడిది కేంద్రాలు. వెరసి తిరునల్వేలి జిల్లా అందరి అభిరుచులకు తగిన ఆకర్షణలను కలిగి ఉన్నది. తిరునల్వేలి వాసులు పర్యాటకులకు ఇచ్చే సలహా ఒకటున్నది. అదేమిటంటే కుర్తాళం జలపాతాలలో జలకాలాడటం, ఇక్కడి మధురమైన హల్వా, అరటికాయ చిప్స్ ఆరగించటం చేయకపోతే తిరునల్వేలి పర్యటన అసంపూర్ణం. నగరంలో జంక్షన్ రైల్వేస్టేషన్ వద్ద అందుబాటు ధరల్లో అద్దెకు వసతి గృహాలు లభిస్తాయి. రుచికరమైన భోజన ఫలహారాలు లభిస్తాయి. || జై శ్రీమన్నారాయణ ||