మన నిజమైన శత్రు ఎదో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు

మన నిజమైన శత్రు ఎదో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు


ప్రతి మనిషిలోను ఏదో ఒక లోపం ఉంటుంది. దానిని పరిస్థితులకు అనుగుణంగా అదుపులో పెట్టుకోవాలి. మన ప్రవర్తన బట్టే మనకి శత్రువులైనా, మిత్రులైనా ఏర్పడతారు. అంటే మన మిత్రుడు, శత్రువు ఇద్దరూ మనలోనే ఉన్నారు. . కోపం, లోభం, అసూయ, స్వార్థం, కామం, అహంకారం ఇవన్నీ మన శత్రువులే. ఎందుకంటే... వీటివలనే ఎదుటివారు మనకి శత్రువులు అవుతారు. గీతలోశ్రీ కృష్ణ పరమాత్ముడు మన నిజమైన శత్రువు ఎవరో చెప్పాడు. అదేమిటంటే...


కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాపా విద్యోనమిహ వైరిణమ్ ||


రజోగుణం వలన ఉత్పన్నం అయ్యే కామ క్రోధాలని తృప్తి పరచడం అసాధ్యం. రజో గుణం వలన ఇంద్రియాల మీద నిగ్రహం ఉండదు. ఇంద్రియాలు పరిపరి విధాల పరుగులెత్తినప్పుడు కోరికలకు అంతు ఉండదు. ఇదే కామం అంటే. ఈ కామం తీరనప్పుడు క్రోధం ఏర్పడుతుంది. పోనీ ఒకవేళ కోరిక తీరినా మరో కోరిక సిద్ధంగా ఉంటుంది. ఫలితం, మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. ఈ జీవితపు నిజమైన విలువను గ్రహించలేకపోతాడు. ఈ గుణాలే నిన్ను పాపం వైపుగా నడిపించే శత్రువులని తెలుసుకో. కాబట్టి దీనికంతటికీ మూలం అయిన రజోగుణాన్ని, తత్ఫలితంగా ఏర్పడే కామ క్రోధాలనూ శత్రువులుగా గ్రహించమంటున్నాడు శ్రీ కృష్ణ పరమాత్మ.


నిజమే. ఏ పురాణాలు చదివినా, చరిత్ర తిరగేసినా కామంతో కళ్ళు మూసుకుపోవడం వలన ఎన్నో అనర్థాలు, అశుభాలు జరిగాయి. మనలోనే ఉన్న కామం సృష్టిని నడిపిస్తున్న గొప్ప గుణమే. ఎందుకంటే అదే లేకపోతే సృష్టి ఆగిపోతుంది. కాని అది మితిమీరితే మానవత్వాన్ని కోల్పోయి, పశుతత్వాన్ని తెచ్చుకుని మనల్ని మనం నాశనం చేసుకుంటూ, ఎదుటివారిని కూడా నాశనం చేసే చెడ్డగుణం అవుతుంది. అందుకని శ్రీ కృష్ణపరమాత్ముడు చెప్పినట్టు మనలో ఉన్న శత్రువును అదుపులో పెట్టుకోకపోతే మన నాశనాన్ని మన కోరుకున్నట్టే. || శ్రీ మన్నారాయణ ||