శ్రీ నృసింహావతార గాథ


శ్రీ నృసింహావతార గాథ


జయ విజయుల శాప వృత్తాంతము


జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనక సనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగిన సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీమహావిష్ణువును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కాని మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాపవిమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చాడు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికారు.


ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రే తాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తులుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారం చేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.


హిరణ్యాక్షుడు - వరాహస్వామి కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గత యైన భూదేవిని సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లితండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్య పాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి, తాను మందరగిరికి పోయి ఘోరమైన తపస్సు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలన్నీ కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడు అయింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలో గాని, ఆకాశంలో గాని, భూమిపైన గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, రాత్రి గాని, పగలు గాని, దేవ దానవ మనుష్యులచే గాని, జంతువులచే గాని, ఆయుధములచే గాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మవరాన్ని అనుగ్రహించాడు.


ఇక వరగర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగపరచాడు. సాధువులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును, మీకు భద్రమగును" అని వారికి అభయమిచ్చాడు.


ప్రహ్లాద వృత్తాంతము


హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే సమయంలో దేవతలు అదనలూ సుకొని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్త్వబోధను గర్భస్తుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నినప్పగించాడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. నిర్వెరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణముల రాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజసప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండా మార్కులకు అప్పగించాడు.


అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువు చెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్థించాడు. గురుకులంలో ప్రహ్లాదుడు గురువుల పట్ల వినయంతో వారు చెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు. ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలిచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము? - అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయుట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ది నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు లుతున్నావు? అని తండ్రి గద్దించాడు. అందుకు ప్రహ్లాదుడు... - "మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల? విష్ణుభక్తి నాకు దైవయాగం వల్ల సహజంగా సంభవించింది అని జవాబిచ్చాడు. అందుకు కోపించిన రాక్షసరాజుకు సరి చెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజు వద్దకు తిరిగి తీసుకొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దు చేసి "గురువులే విద్యాంశంబులు జెప్పిరో, విద్యా సారమెరుంగకోరెదభవదీయోత్కరమత్ పవే ననుగన్న తండ్రీ" - అని అడిగాడుఅప్పుడు ప్రహ్లాదుడు... చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ! అని చెప్పెను. -


మరి ఆ మర్మమేమిటి? "తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెరుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రముశ్రీ హరి భక్తిలేని బ్రతుకు వ్యర్థము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి" అని వివరించాడు. - హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపై నుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. ఆదూ సి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొర పెట్టుకున్నాడు. . క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు. ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.


ఆహరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా... కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్జలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలగలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటస్థలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు. ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదజిూ చిన నందందే గలడు" అని చెప్పాడు. హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తరింప శ్రీ నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబుతోన్న ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొంటుండగా హరి సకల జడ, చేతన పదార్థములలోశ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం) అయితే "ఈ స్తంభమునన్ పగలవె చక్రిన్ గిడ్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు అన్నింటిలో విశ్వాత్ముడై యుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహము లేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సదా ద్దాం. ఈ స్తంభంలో విష్ణువుచూ పకుంటే నీ తల తీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.


శ్రీ నరసింహావిర్భావం


బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పది దిక్కుల నిప్పులు చెదిరాయి. . ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును.... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంషాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైనశ్రీ నృసింహదేవుడు స్తంభమునుండి ఆవిర్భవించాడు. ఇది నరమూర్తి కాదు. కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదనుకొన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తన యొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్ళతో) చీల్చి చెండాడాడు. ఇలాశ్రీ హరి (మనిషీ, జంతువూ కాక) నారసింహుని రూపంలో, (పగలూ రాత్రి కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా ఆకాశంలో కాక) తన తొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్థము కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.


హిరణ్యకశిపుని చంపుతున్న నరసింహ అవతారము


స్వామి ముఖం భీకరంగా కనిపిస్తోంది. రక్త రంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. వులను కంఠమాలికలుగా వేసుకొన్నాడూ లునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీ నారసింహస్వామి తన అభయ మంగళ దివ్యహస్తాన్ని ప్రహ్లాదుని తలపై నుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాలస్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు. "స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు. ప్రహ్లాదుడు. "నాయనా, నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు) పావనమైనాయి. నాస్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తరక్రియలు చేసి రాజువుకా.నాయందు మనసునిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి. - శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీ నారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యముని గురించిన భయముండదు" అన్నాడు బ్రహశ్రీ లక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమ లోకములకరిగిరి. ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.


శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సం చారము నెవ్వడైన సువిచారత విన్న పరించినన్ శుభా కారము తోడనే భయము గల్గని లోకము జెందు భూవరా!


"జయ జశ్రీ నృసింహ జయ జశ్రీ నృసింహ" "జయ మన్నారాయణ" "జయ రామానుజ"