ఛాందోగ్యోపనిషత్తు,పరాశక్తి మరో రూపమే గాయత్రీమాత,సకల దేవతా స్వరూపుడు -వేంకటేశ్వరుడు

ఛాందోగ్యోపనిషత్తు


ఛందస్సు అంటే వేదము. అట్టి ఛందస్సును పొందినవాడు ఛందోగుడు. మహర్షి. అతడు గానము చేసినది కనుక దీనికి ఛాందోగ్యమని పేరు కలిగెను. ఉపనిషత్తులను ఉపక్రమించు నపుడునూ, ఉపసంహరించునపుడునూ గురుశిష్యులిరువురికీ క్షేమార్ధమై ఆయా వేదములకు విహితములయిన శాంతి మంత్రాన్ని పఠించాలి. అట్లే సామవేదానికి చెందిన ఈ ఉపనిషత్తును గానం చేసేటప్పుడు - మాహం "ఓం ఆప్యాయత్తు మమాంగాని, వాకాణశ్చక్షుః శ్రోత్ర మధోబల మిస్ట్రియాణి చ సర్వాణిసర్వం బ్రహ్మూపనిషదం, మాహం బ్రహ్మనిరాకుర్యాం, మమా బ్రహ్మ నిరాకరోత్, తదాత్మ నిరతే ఉపనిషదత్సు ధర్మాస్తే మయి సస్తుతే మయినను" అను శాంతి మంత్రాన్ని పఠించాలి. ఈ ఉపనిషత్తునందు 'అన్నము' పరబ్రహ్మ స్వరూపంగా ప్రతిపాదింపబడింది. శ్రావొద్దీధములో ఒక ఋషిని అనుగ్రహించ టానికై వేదపురుషుడు తక్కిన దేవతలను తన పిల్లలుగా చేసికొని తానొక తెల్లకుక్క వేషము దాల్చి వచ్చి 'బహిష్పవమాన' మను సామమును గానము చేసినచో అన్నము లభించునని ఉపదేశించాడు. తర్వాత మధురమైన మధుజ్ఞానము తెలుపబడింది. ఆదిత్యుడు దేవమధువు. దానికి స్వర్గలోకము అడ్డు వెదురుకర్ర. అంతరిక్ష లోకము తేనెతుట్టె. భూమి నుండి సూర్యునితో గ్రహింపబడు జలకగుణములైన కిరణములు పుత్రులు. తూర్పు కిరణములు తూర్పు తేనెతుట్టె బెజ్జములు. ఋక్కులు తుట్టెయందు తేనెను తెచ్చి ఉంచు ఈగలు. ఈవిధంగా మధుత్థానము మనోహరముగా చెప్పబడింది. | జగత్తుగా పరిణమించి ఉండు బ్రహ్మమును ఎంత సులభంగా, సూక్ష్మంగా మనస్సున కెక్కించుచున్నదో ఈ పోలిక చూడుడు. జగత్తు ఒక పెద్ద సంచి. దానికి అంతరిక్షము కడుపు. భూమి దిగువ ఉండేది. నాశము లేనిది. దిక్కులు దానికి ఓరలు. స్వర్గము దానికి మీది రంధ్రము. ప్రాణుల కర్మఫలము దానిలో ఉంచబడిన ధనము. ఆఫలంలో ఈ జగమంతా నింపబడింది. | అత్యంత సూక్ష్మమైన సత్తు నుండి ఈ మహత్తైన ప్రపంచము ఎట్లా కలిగిందని శిష్యుడు ప్రశ్నింపగా, గురువు ఆ మహావిషయాన్ని అతి సూక్ష్మంగా ఇట్లా ఉపదేశించాడు.. గురువు : (శిషయహ చి) ఒక మర్రిపండును తీసుకొని రా! శిష్యుడు : ఇదిగో తెచ్చాను గురువు : దాన్ని త్రుంపుము శిష్యుడు : త్రుంచితిని .


గురువు : దీనియందేమి కలదు? శిష్యుడు : అత్యంత సూక్ష్మమయిన విత్తనాలు కలవు గురువు : వానిలో ఒక విత్తనము చీల్చుము. శిష్యుడు : చీల్చితిని గురువు : అందేమి యున్నది? శిష్యుడు : ఏమియు లేదు ఆ మీదట గురువు శిష్యునకిట్లా ఉపదేశించాడు. ఇట్లు ఏమియు లేని సూక్ష్మము నుండి పెద్ద మర్రి చెట్టు ఎట్లా కలిగిందో, అట్లే సూక్ష్మమైన సత్తు నుండి ఈ మహాప్రపంచం కలిగిందని తెలుసుకో. ఈ సకల జగత్తు నందును ఆత్మ కలదు. అది నిత్యవస్తువు. అదే ఆత్మ. అది నీవై ఉన్నావు.


| మరల శిష్యునకు ఒక సందేహము కలిగింది. "ఇట్టి సత్తు మాత్రమైన వస్తువు ప్రపంచానికి మూలమై ఉండగా అది కనబడకుండటానికి కారణమేమి? దానిని దృష్టాంతముతో ఇంకొకసారి చెప్పమని' గురువుని ప్రార్థించాడు. అంత గురువు ఒక ఉప్పుగడ్డను తెచ్చి ఒక్క చెంబుడు నీళ్ళలో రాత్రి వేసి ఉంచి మరునాడు తన యొద్దకు రమ్మన్నాడు. శిష్యుడట్లే చేసి మరునాడు ఉదయమున గురువు దగ్గరకు వెళ్ళగా, గురువు ఇప్పుడా ఉప్పుగడ్డను తీసుకుని రమ్మన్నాడు. శిష్యుడు ఆ ఉప్పుగడ్డకై నీళ్ళలో వెయూ చి అది కనబడని కతమున మరలి వచ్చి గురువుమా చి "ఆ ఉప్పుగడ్డ నీటిలో కరిగిపోయినది. కనబడుటలేదు" అనెను. అంత గురువు "అది నీళ్ళలో కరిగిపోయినది. దానిని కంటితో చుటకు వీలుకాదు. అయితే వేరువిధముగా తెలుసుకొనవచ్చును" అని చెప్పి శిష్యునితో దానిపై నీటిని త్రాగడమన్నాడు. శిష్యుడు తిరిగి ఉప్పగా ఉన్నదన్నాడు. మధ్య జలమును త్రాటాడమన్నాడు. శిష్యుడు తిరిగి ఉప్పగా ఉన్నదన్నాడు. అంత గురువు శిష్యుని దగ్గరకు పిలిచి 'నాయనా! జలమునందు ఆ ఉప్పు కలిసిపోయి ఉంది. ఎలాగైతే కంటితడటానికి గాని, చేతితో తాకటానికి గాని సాధ్యం కాక నాలుకతో రుపాచి తెలుసుకొనుటకు మాత్రమే సాధ్యమై కలిసి ఉన్నదో అట్లే శరీరము నందు సత్తు కరిగి ఉన్నది. అది ఇంద్రియములచే ఎరుగుటకు సాధ్యము కాదు. కానీ మరొక విధముగా తెలుసుకొనవచ్చును. అది సత్య వస్తువు. అది ఆత్మ అనునది. అది నీవై ఉన్నావు' అనెను. అప్పుడు శిష్యుడుసంతృప్తిని ప్రకటించెను.


| గురూపదేశము శిష్యునికి ఎట్లు తోడ్పడునో ఈ దృష్టాంతము మూలమున ఈ ఉపనిషత్తు బోధించుచున్నది. | గాంధార దేశములో నుండి ఒకని కన్నులను, చేతులను కట్టి జనసంచారము లేని ఒక ప్రదేశానికి తెచ్చి వదిలిపెట్టి పోయినచో అతడు తన దేశానికి పోలేక "నేనిచ్చటికి కొని తేబడితిని. నాకెవ్వరైనా ఈ కన్నులను, చేతులను విప్పివేయమని" శ్రీవేంకటేశం (సెప్టెంబర్-2019| 7 ప్రలాపించుచుండెను. ఆ సమయంలో దైవవశమున ఎవడో దయగలవాడు ఆ మార్గంలో వచ్చి వాని కట్లను విప్పి, గాంధార దేశము ఈ దిక్కులో ఉంది. ఈ మార్గంగా పొమ్మని తెలపగా అతడు గ్రామ గ్రామముగా పోయి, దారి తెలిసికొని ఆ దేశానికి చేరుకున్నాడు. అట్లే పురుషుడు సత్తు నుండి వచ్చి తేజోభిన్నమైన అరణ్యానికి చేరి, మోహమనెడి వస్త్రంచే కట్టబడిన నేత్రములు కలవాడుగను, జాత్యాది బంధములచే బంధింపబడినవాడుగను, పుణ్యపాపములనెడి దొంగచే పట్టుకొని రాబడినవాడుగను, "నేను ఫలానా వాని కుమారుడను. వీరు నా బంధువులు. . నా ధనము నష్టమైనది. నేనెట్లు బ్రతికి ఉందును" ఇత్యాదిగా ప్రలపించువాడుగను ఉండి తరువాత ఏదేని పుణ్యవశమున కరుణగను, గురువుచే దాకటాపబడి సంసారమునందు విరక్తి పొందినవాడై తుదకు సత్తును పొందుచున్నాడు.


సత్తుతో చేరినవారు మేము సత్తుతో చేరితిమి అని చెప్పక పోవటానికి హేతువేమి? అని శిష్యుడు ప్రశ్నించగా గురువు చక్కని దృష్టాంతంతో ఆ సందేహాన్ని ఈవిధంగా చెప్తున్నాడు.. తేనెటీగలు అనేక ప్రదేశాల్లో ఉండే వృక్షాలలోని పుష్ప రసాలనన్నింటిని ఒకచో చేర్చి, ఒక్క రసముగా చేసి తేనెను కలిగించుచున్నది. ఆ రసములు ఒక్కొక్కటియు తానీ వృక్షములోని పుష్పరసమని ఎరుగుట లేదుకదా! అట్లే ఈ సకల ప్రజలును సత్తును చేరియు సత్తుతో చేరితిమని ఎరుగుట లేదు. ఇంకొక మనోహర దృష్టాంతము : ఎట్లు దారముతో కట్టబడిన పక్షి ఎక్కడికి పోయినప్పటికిని నిలుచుటకు వీలులేక ఎప్పటియట్లు కట్టబడిన చోటికే వచ్చి చేరుచున్నదో, అట్లేమనస్సు ఎక్కడెక్కడికి పోయినప్పటికిని వేరుచోట కనబడనందున సుషుప్తి కాలమునందు ప్రాణమనెడి పరమాత్మనే చేరుచున్నది.


ఆదిత్యుడు బ్రహ్మమని ఉపదేశించు ఖండము నందు కవి కాల్పనిక దృష్టి మహనీయముగా భాసించుచున్నది. పూర్వము ఈ జగత్తు నామ రూపాదులు లేక అసత్తుగా ఉంది. పిమ్మట సత్తు అయి క్రమక్రమముగా వృద్ధి పొందెను. అది ఒక గ్రుడ్డు వంటిది అయింది. పిమ్మట పగిలింది. ఈ రెండు చీలికలలో ఒక చిప్ప వెండిగను, మరొక చిప్ప బంగారంగాను ఉంది. వెండిగా ఉన్నది భూమి అయింది. బంగారంగా ఉన్నది స్వర్గమయింది. గర్భములోని స్థూలకోశము పర్వతాలయ్యాయి. సూక్ష్మకోశము మేఘము, మంచుగా అయ్యాయి. నాడులు నదులయ్యాయి. మూత్రకోశము జలము సముద్రమయ్యాయి. ఆగ్రుడ్డునందుండి కలిగినది ఏదియో (ఏ శిశువో) అది సూర్యుడు. ఇట్లా మనోహరములైన దృష్టాంతాలతో మధురోహలతో సుందరంగా, సులభంగా ఛాందోగ్యోపనిషత్తు బ్రహ్మవిద్యను ఉపదేశిస్తున్నది. బ్రహ్మవిద్యోపాసకులకు ఇది పరమ ఉపాదేయము. పవిత్రము, ప్రధానము అయి వెలయుచున్నది.


 



పరాశక్తి మరో రూపమే గాయత్రీమాత -డా|| కె.బి.రాజేంద్రప్రసాద్


శ్లో || గాయత్రీ వేదజననీ, గాయత్రీ లోకపావనీ | న గాయతాః పరంజప్యమేతద్విజ్ఞానముచ్యతే || అంటారు. పురాణ మునులు. వేదమాతే గాయత్రి. సర్వలోకాలను పునీతం చేసే తల్లి. రాత్రీ మంత్రం కన్నా జపింపదగ్గ మంత్రం, గాండ్రీ తత్వం కన్నా తెలియదగిన మహోన్నత తత్త్వం ఈసృష్టిలో లేదు.మన సనాతన ఉపాస్యదేవత గాంతీ మాత. అమ్మను శ్రుతులు బహుధా కీర్తించాయి. బహు చక్కగా వర్ణించాయి. "అగ్నిముఖం, బ్రహ్మశిరం, విష్ణువు హృదయం, రుద్రుడు శిఖ" అంటూ త్రిమూర్తులే అమ్మ స్వరూపంగా చెప్పడం విశేషం. అగ్ని పావనత్వానికి, స్వచ్ఛతకు ప్రతీక. గానం చేసేవారిని అనగా తనను ధ్యానం చేసేవారిని రక్షించే తల్లి కనుక గాయత్రి అని చెప్పబడింది. సర్వప్రాణులలో ఏ పరాశక్తి అయితే ఆత్మరూపంలో భాసిస్తుందో, ఏ మంత్రోచ్చారణ సాధకునకు మోక్షాన్ని అందిస్తుందో ఆ తల్లి రాత్రీ మాత. ఆదిపరాశక్తి యొక్క అంశతో ప్రకాశించే ప్రకృతి పంచకంలో నాల్గవ రూపం గాయత్రి. ఆ తల్లినే సవనాలలో Il l  సావిత్రిగా కొలుస్తారు. మంత్ర తంత్రాలకు, సంధ్యావందన వైదిక క్రియకును అమ్మే ఆధారం. శుద్ధసత్య స్వరూపిణి. సంస్కార సమగ్ర సుందర సుస్వరూపిణి, బ్రహ్మతేజో రూపిణి, మహాశక్తి సంపన్న గాత్రీ మాత. ఈ తల్లి ఉదయపు సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్నపు సంధ్యలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతీమాతగా పూజలందుకుంటోంది. అంబిక, శివుడు, ఆదిత్యుడు, విష్ణువు, వినాయకుడు శ్రీ మాత పంచముఖాలంటారు.గాంత్రీ మంత్రమహిమఅనిర్వచనీయం. అమోఘం. దివి నుండి భువికి దేవతలను తీసుకువచ్చి, హవిస్సు మొదలైన భోజ్య పదార్థాలను అందించగల్గిన శక్తి గాత్రీ మంత్రానికి, గాత్రీ ఉపాసకులకు ఉంటుంది. దివిజులు సాధకులను వాంచితార్ధాలతో అనుగ్రహిస్తున్నారంటే అది ఒక్క రాత్రీ మంత్ర మహిమ ప్రభావమని గుర్తించాలి. గాంత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సాధకుని శరీరంలోని ప్రతి అణువును సాత్వికశక్తితో ఉత్తేజపరుస్తాయి. శారీరకంగా, మానసికంగా రాత్రీ మంత్ర ఉపాసకుడు సానుకూల స్పందనలు కల్గి ఉంటాడు. ఫలితంగా చెడు _రణలు నశించి, సత్కర్మలను ఆచరించే బుద్ధి పెరుగుతుంది.


ఆధ్యాత్మిక సంస్కారం పెరిగి, వ్యక్తిని బలవంతుణ్ణి చేస్తుంది. మనిషి మనిషిగా, మానవతను నింపుకొని, దైవత్వపు దారిలో నడకను ప్రారంభిస్తాడు. ఇంక సాధకునకు అమృతమయమైన ముక్తి సామ్రాజ్యపు ద్వార కవాటాలు కన్పిస్తాయి. కనువిందు చేస్తాయి. జీవాత్మ పరమాత్మ తత్త్వదర్శనం చేయడానికి మార్గం సుగమమవుతుంది. | అయితే ఇలాంటి పరాశక్తి పరమ ఆత్మీయమైన గాండ్రీ ఉపాసన కాలక్రమంలో వెదకుకొనవలసిన స్థితి, పరిస్థితులను గమనిస్తున్నాం. ఉపనయన సంస్కారంతో గాత్రీ మాతను గానం చేయడం నేర్చుకొనిన వ్యక్తి తన మనస్సు, వచస్సు, మేధస్సులను తేజోవంతంగా మలచుకొనే ప్రయత్నం చేస్తాడు. తనలో కలిగే జ్ఞానదీప్తి, చైతన్యస్ఫూర్తి అమ్మశక్తిగానే భావించి, విశ్వసించి, వినయంగా, విచక్షణతో, విశ్వమానవునిగా మనుగడను మార్చుకొంటాడు. మాటలో, చేతలో, చరితలో, ఆలోచనలో, ఆలోకనంలో,అధ్యయనంలో క్రమతనుపాటిస్తాడు. క్రమశిక్షణాయుతసుజ్ఞాని అవుతాడు.కాలంతోపాటునడుస్తాడు. కాలాన్ని తన అధీనంలోనికి తెచ్చుకొంటాడు. కాలం కన్నా ముందు ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే, | ఈనాడు మనవారు సంధ్యావందనానికి, గాత్రీ జపానికి సమయం లేదు అంటూ మానేసేవారు కొందరైతే, మొక్కుబడిగా చేసేవారు మరికొందరు కన్పిస్తున్నారు. పెద్దలు గుర్తు చేస్తే వారికి చాదస్తంగా కనిపిస్తుంది. ఇది మారాలి. బ్రతుకు వేగం పెరిగి ఉండవచ్చు. ఉపాధి వేట లేదా బాట పరుగులు తీయించవచ్చు. కాని సంస్కారం నేర్పే, సాధుతత్వాన్నిచ్చే, సంయమన సత్యాన్ని తెలియచెప్పే సాత్రీ మాతను మనం మరువరాదు. కన్నతల్లి లేదా కడుపునిండా తిండి వ్యక్తికి ఎంత ముఖ్యమో, జ్ఞాన విజ్ఞాన చైతన్యమూర్తి అయిన శ్రీ మాతయూ అంతే ముఖ్యం. జీవన _మార్గాన్ని, జీవన గమనాన్ని, జీవన గమ్యాన్ని సదా నిర్దేశించే ఆత్మజ్యోతి, ఆదిపరాశక్తి, అమృత కళారూపమైన గాత్రీ . ఉపాసనను అనుసరించవలసిన అవసరం తెలియచెప్పడంలో భాగమే నవరాత్రులలో ఒకరోజు అమ్మవారు రాత్రి మాతగా మనకు దర్శనమిస్తున్నారు.


పండువెన్నెలలతో, పైరుపచ్చలతో పరిఢవిల్లే మాసం ఆశ్వియుజమాసం.శరదృతువుశోభతోప్రకృతికాంతపరవశించే శుభసమయం. శక్త్యారాధనకు, అర్చనకు అనువైన కాలం. కాలపురుషుని కూడా తన అధీనంలో ఉంచుకొని సృష్టి జీవులను ఆదిపరాశక్తి అలరించే శుభతరుణం. దుర్గతులను దూరీకరించే దుర్గమ్మను పూజించే పర్వదినాల సమయం ఆశ్వియుజం. జగన్మాత శతాక్షియై, శాకంబరియై దివిజులకు, మానవులకు, జంతుకోటికిని ఆహార పానీయాలతో, శాకాహారంతో, విభిన్న గడ్డిమొలకలతో ఆకలిదప్పులు దీర్చి ఆదుకొన్న పావనకాలం. చండియై చండముండులను, మహిషాసురుని సంహరించి, మహాశక్తిగా వెల్గొంది, సకల లోకాలను కాపాడిన దివ్యపక్షం ఆశ్వియుజ శుక్లపక్షం. అలాంటి పరాశక్తి అవతారాలు అలంకారాలు ఎన్నో, మరెన్నో. శరన్నవరాత్రుల పేరుతో జగన్మాతను పూజించడం, ఉపాసించడం బిడ్డలుగా మన కర్తవ్యం. మనలోని శక్తికి, యుక్తికి, దీప్తికి, చైతన్యానికి, ఆశకు, ధ్యాసకు, భాషకు, భావనకు మూలమైన అమ్మలగన్న యమ్మ నవదుర్గలుగా, సప్త మాతృకలుగా, ప్రకృతి పంచకంగా, దశమహావిద్యలుగా, విశిష్టం, విఖ్యాతం అయిన రీతిలో, మహనీయ విభూతితో దర్శనమిస్తుంది. అలాంటి అనేక అవతారాలలో మహనీయమైన, తేజోవంతమైన, అవతార విశేషం గాత్రీ అవతారం. ఆశ్వయుజ శుక్ల తదియ నాడు ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ గాత్రీ మాతగా దర్శనమిస్తుంది. రాత్రీ మాత ఆత్మవాంఛలను తీర్చి, జనన మరణ చక్రం నుండి తప్పించి, ముక్తిని ప్రసాదించే కామధేనువు అని మహర్షులు సెలవిచ్చారు. శ్లో || సర్వాత్మాహి యాదేవీ సర్వభూతేషు సంస్థితా | గాత్ర మోక్ష హేతుశ్చ మోక్షస్థాన లక్షణమ్ || మనందరిలో ఆత్మరూపమైన శక్తి గాయత్రి.


మనందరిలో ఆత్మరూపమైన శక్తి గాయత్రి. మోక్షానికి హేతువు. మోక్షస్థానం కూడా అని వ్యాసులవారు విశ్వాసం ప్రకటించారు. గాత్రీ మాత అనుగ్రహ మహిమను గూర్చి దేవీభాగవతం ఒక కథను వినిపిస్తోంది. పూర్వం గౌతముడనే మహర్షి సదా గాత్ర మాతను ఉపాసిస్తూ సర్వసంపదలతో, ఆశ్రమవాసం చేస్తూ, వచ్చిన అతిథులకు లేదనకుండా అన్నదానం చేస్తూ, కాలం గడుపుతున్నాడు. ఇలా ఉండగా అనావృష్టి పీడితులై, కరువు రక్కసి నోట జిక్కి, ఆకలి దప్పులతో అల్లాడుతూ కొంతమంది బ్రాహ్మణులు గౌతముని ఆశ్రమానికి వచ్చారు. మహాజ్ఞాని, వితరణశీలి, పుణ్యవంతుడైన గౌతముడు వారిని ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. వారికి నివాస సౌకర్యాలను కల్పించాడు. తాను నిత్యం పూజించే జగన్మాత గాత్రీ మాతను ప్రార్థించి, ఆ తల్లి అనుగ్రహంతో వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఆదరించాడు. వారు సుఖంగా జీవిస్తున్నారు గౌతముని ఆశ్రమంలో. కాలం ఇలా 12 సంవత్సరాలు గడిచింది. నారదాది మహామునులును గౌతముని కడకు వచ్చి, ఆయన రాత్రీ మంత్రోపాసనను, ఆరాధనార్చనలచూచి ముగ్గులై ఆయనను ప్రశంసించి వెళుతున్నారు. ఇదంతా స్తున్న అతిథులుగా వచ్చిన బ్రాహ్మణ సంఘానికి కంటగింపయింది. ఈర్ష్యాసూయలు వారిలో పెరిగాయి. గౌతముని ఔన్నత్యాన్ని దెబ్బకొట్టి పరాభవించాలని భావించారు. ఒక ముసలి ఆవును సృష్టించి, గౌతముని దగ్గరకు పంపారు. గౌతముని మంత్రి స్వరాలకే ఆ గోవు పడి చనిపోయే విధంగా కుట్రపన్నారు. ఆ కుట్ర ఫలితంగా ఆ గోవు పడి చనిపోవడం, "గౌతముడు గోహత్య చేశాడ'ని ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు. గౌతముడు ఖిన్నుడై ఆలోచనలో పడ్డాడు. | అనంతరం గౌతముడు తన అగ్ని గృహానికి వెళ్ళి, ధ్యానంలో కూర్చున్నాడు. రాత్రీ మాత జరిగిన వాస్తవాన్ని ధ్యానముద్రలో గౌతమునికి తెలియజెప్పింది. అంతే గౌతమ మహర్షి ఆగ్రహోదగ్రుడైనాడు. "కృతఘ్నులారా! మంచికి వంచన చేస్తారా? ఇకపై వేదమాత గాతీ ధ్యానం, వేదపఠనం, భగవతీ ఆరాధనం శివపూజలకు మీరు దూరం అవుతారు " అని శపించాడు. వెంటనే గాతీ మందిరానికి వెళ్ళాడు. అమ్మ పాదాలపై పడి దుఃఖించాడు గౌతముడు. తాను చేసిన పుణ్యకార్యాలు ఇలా ఫలితాన్నిచ్చాయని కృంగిపోయాడు. అప్పుడు గాండ్రీ మాత ప్రత్యక్షమై గౌతముని తల నిమురుతూ ఓదార్చింది. శ్రుతికి ప్రతిగా అపశ్రుతులు కొన్ని సందర్భాలలో తప్పవు గదా! జ్ఞానానికి అజ్ఞానం, సత్యానికి అసత్యం ఎప్పుడూ ఎదురే ఉంటాయా చి నడువవలసిన బాధ్యత సాధకునిది. ఇంతలో తప్పు తెల్సుకున్న ఆబ్రాహ్మణులు వచ్చి "క్షమించమ"ని గౌతముని పాదాలు పట్టి వేడుకోవడం, గౌతముడు కనికరించడం జరిగింది. "గా మాత పాదధ్యానమే మీకు మంచిని చేస్తుంది.శ్రీ కృష్ణుని నిర్యాణం అనంతరం తిరిగి మీరు భూలోకంలో పుడతారు. అప్పటివరకు మీరు కుంభీపాక నరకాన్ని అనుభవిస్తారు. వేదాన్ని విస్మరించినవారు, గాయత్రిని కాదన్నవారికి ఇక్కట్లు తప్పవు. గాంతీ ఉపాసన, పరాశక్తి ఆరాధనే అన్నింటికి పరమ ఔషధం" అని వారికి హితవు గరిపాడు గౌతముడు.


శ్లో || ఆదిశక్తీ జగన్మాతర్భక్తానుగ్రహకారిణీ | సర్వత్రవ్యాపికే అనంతే సంధ్య తే నమోస్తుతే || అంటూ "ఆదిశక్తి, జగన్మాత భక్తానుగ్రహకారిణి, విశ్వమంతా వ్యాపించియున్న అనంతమైత్రీ సంధ్యా రూపంలో ఉన్న గాత్రీ మాతా నీకు నమస్కారాలు. స్తుతులు" అంటూ అమ్మవారి 24 శ్లోకాలను పారాయణం చేస్తే సకల శుభాలు కల్లుతాయి. నవరాత్రి గాండ్రీ అమ్మవారికి పులిహోర, కేసరిలను నైవేద్యాలుగా భక్తులు సమర్పిస్తారు. నిజానికి అమ్మ ఆరాధనకు ఇదొక అవకాశం. మంచి కాలంలో మంచి కార్యాలకర్రీ కారం చుడదాం.గాంతీ ఉపాసనలో ఉన్నవారు మరింతభక్తిశ్రద్ధలతో, సదాచార సంపత్తితో సదా అమ్మ సేవను చేయాలి. లేనివారు, లేక మధ్యలో వదలినవారు, జరిగినదానికి ప్రాయశ్చిత్తం చెప్పుకొని, తిరిగి నూతనోత్సాహంతో, నూతనోత్తేజంతో అమ్మను ధ్యానించి, అమ్మవారికృపకు పాత్రులమవుదాం. ముఖ్యంగా విద్యావంతులు విచక్షణాయుతులంటారు. కనుక తెలిసి మంత్రపఠనం, ఎరిగి, ఉపాసనా కార్యక్రమం, శ్రద్ధాసక్తులతో మంత్రజపం చేద్దాం. అందుకు ఆదిపరాశక్తి మనలోని బుద్ధి మేధస్సులను | రేపిస్తుందని ఆశిద్దాం. విశ్వసిద్దాం. విశ్వాసం బలం. ఆశ బ్రతుకుపాటకుపల్లవి.ఆశ లేనిదే ఆశయం సిద్ధించదు.విశ్వాసం లేనిదే విశ్వశక్తి సహకరించదు. రెండూ గల ఉపాసకునకూ కాలంతో పాటు అన్నీ సహకరిస్తాయి. సత్ఫలితాన్నిస్తాయి.



సకల దేవతా స్వరూపుడు -వేంకటేశ్వరుడు                   - డా|| పేకేటి గీత


స్వామిని సాక్షాత్తు నారాయణుడైన శ్రీ నివాసునిగా భావించి, పూజించి, స్తుతించడం విశేషవ్యాప్తిలో ఉంది. ఆపద మొక్కులవాడుగా, శ్రీ నివాసునిగా భావించి పూజా కైంకర్యాలు నిర్వహించి, తిరుమలలో వైఖానసాగమోక్త ప్రకారం కైంకర్యాలు జరుగుతున్నాయి. అభయహస్తంతో, మందస్మిత ముఖారవిందంతో ఉన్న తిరుమలేశుచూ డగానే ఒళ్ళు పులకరిస్తుంది. అఖిల లోకేశ్వరుడు సకల పాప నివారకుడు శ్రీ వేంకటేశుడు. శ్వేత వరాహస్వామి వృషాచలంలో భూదేవిని అంకములో కూర్చుండబెట్టుకుని ప్రథమ పూజలు గైకొంటూ వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కుతూ, దక్షిణభాగంలత్రే నివాసుడు కొలువై శంఖ చక్రగదాధారిగా స్వయం వ్యక్తంగా ఉన్నాడు. శ్రీ నివాసుని దివ్యమంగళ విగ్రహ సౌందర్య వర్ణనలో త్రైలోక్య సుందరి యగు లక్ష్మీదేవిశ్రీ నివాసుని వక్షస్థల స్వామి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉంటుంది. లోకానికి యజమానురాలు స్వామికి ప్రియురాలు. ఆయన ఉండి ఆయన క్షమాగుణాలను వృద్ధి చేస్తుంటుందినాభి నుంచి జన్మించిన బ్రహశ్రీ వారి పాదకమల ఎనిమిది కన్నులతో స్తుంటాడు. సృష్టి అంతటా స్వామిని దర్శించుటయే ఇందులో విశేషం.


ఆదిశేషుడు స్వామి పాదస్పర్శను అనుభవించడానికి పాతాళంలోకి వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తున్నాడని పురాణ కథనం. స్వామి పాదాల్లోని పద్మరేఖలత్రీ పాదాల పురాణాలను వర్ణిస్తున్నాయి.


గ్రుడ్డివారికి కరటి పునిచ్చి తన దివ్యమంగల విగ్రహ దర్శనాన్ని కల్గిస్తాడు. | చెవిటివాళ్ళకు చెవులిచ్చి తన దివ్య చరితను వినమన్నట్లుగా చెప్తాడు. మూగవారికి వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. | భక్తులకు కష్టాలు తొలగించి, మనోరథాలు ఫలింపచేస్తాడు. స్వామి చరణాలను శరణు పొందితే జన్మరాహిత్యం కల్గుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. సూర్యభగవానుడు నిత్యం తిరుమలకు వచ్చి నిత్యవాసం చేస్తున్న చోటు తిరుమల. దేవతలు నిత్యం సేవించాలి, తిరుమల అనాది దివ్యదేశం. తిరుమలలోని చరాచరాలన్నీ ఉపాదేయాలే. | "భక్తులకు ఆపదలు కల్గినపుడు వాటిని తీర్చడం కోసం భగవానుడు అవతారమును ఎత్తుతాడు. అటువంటి అవతారమే శ్రీ వేంకటాచలంలో వెలసితీ నివాసుడని" ఆళ్వార్లు ప్రబంధాల్లో చెప్పారు.


ఇహలోక, పరలోక వాసుల పాపాలను నశింపచేసి, మనస్సు అను దీపాన్ని ప్రజ్వలింపచేసే పరమ భోగ్యమైన తిరుమలేశుని కొండ నాల్గు దిక్కుల నుండి దేవతలు వచ్చి ధూప, దీప, పుష్ప, తీర్థ, నైవేద్యాలను సిద్దం చేసికొని ఆరాధన చేసే తిరుమల వేంకటేశ్వరుడు అభిమానించే దివ్య ప్రదేశం. | భూమిని మహా వరాహావతారాన్ని ధరించి ఉద్దరించాడు. ఇంద్రుడు పల్లెలో వడగళ్ళ వానను కురిపించినపుడు గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తాడు. నేడు భూలోక వాసులను ఉద్దరించునిమిత్తం భక్తసులభుడుగా,పరమభోగుడై తిరుమలలో వేంచేసి ఉన్నాడు. అసురుడైన హిరణ్యకశిపుని సంహరించి, లోకరక్షణను చేసిన నృసింహస్వామి స్థిరంగా వేంచేసిన చోటు, పరమ భాగవతో సరుడైన ప్రహ్లాదుని రక్షించిన చోటు తిరుమల. ఆర్త రక్షణ కోసం భూలోకానికి విచ్చేసిటీ వేంకటాచలపతిని పొగడడం కాలతత్వం ఉన్నంతవరకు ఎవరికీ తెలియదు.


వేద శాస్త్రాల ప్రవర్తకుడు భగవానుడే. పరమపద వాసులకు పరమ భోగుడు ఐనశ్రీ వేంకటేశ్వరుడు మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించి సద్దతిని ప్రసాదిస్తాడు. భగవానుడు వివిధ అభిమాన క్షేత్రాల్లో, వివిధ రూపాల్లో నెలకొని ఉండడం విశేషం. శ్రీ రాముడు నిత్యవాసం చేసే పర్వతం తిరువేంగడం. భక్తులను అనుగ్రహించడం కోసం విభవావతారాలు దాల్చి అర్చారూపిగా సేవను అనుగ్రహిస్తూ ధర్మసంస్థాపన, దుష్టశిక్షణకై మానవునిగా అవతరించినవాడు సర్వశక్తి అయిన సర్వేశ్వరుడు. నీలమణి వలె వెలిగేవాడు, శ్రీ హస్తాలతో తనను ఆశ్రయించినవారిని అనుగ్రహిస్తుంటాడు. లతలతో, వృక్షాలతో అనేక తీర్థాలతో అందంగా విలసిల్లుతున్న పరమ భోగ్యమైన జలసమృద్ధితో కళకళలాడుతున్న ప్రదేశమే వేంకటాచలం. తిరుమల కొండపైని వానరాలు బ్రాహ్మీ ముహూర్తంలో ప్రబోధిస్తున్నారు. సర్వస్వామియై, పంచభూతాలకు అంతర్యామియై, ఎనిమిది దిక్కులు తానే అయి వేద ప్రతిపాదుడై పరమపద స్వరూపుడై, స్వామి వేంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. త్రివిక్రమావతారంలో తన పాదాలతో కొలిచిన స్వామిని ధ్యానించే యోగుల హృదయ కమలాలలో నెలకొని ఉన్నాడు. ప్రళయం నుండి భూమిని ఉద్ధరించిన వరాహస్వామి వేంచేసి ఉన్న దివ్యప్రదేశం తిరుమల కొండశ్రీ సీతారాములు విహరించిన చోటు, దివ్యతీర్థాలతో నిండి ఉండే వేంకటాచలం భూలోక వైకుంఠం. 


స్వామి వేలాడే జడలతో, బంగారు కిరీటంతో, అందమైన గొడ్డలి, సుదర్శన చక్రం, నడుమును చుట్టుకొని ఉండే సర్పం, బంగారు మొలనూలు కల్గి ఉండడం చేత హరిహర రూపాలు రెండూ చేరి ఒక్కచోట వెలసినట్లుండడం ఆశ్చర్యకరం. ఒక పర్వతాన్ని కీర్తించాలంటే వేంకటాచలాన్ని కీర్తించండి. మాలికను అలంకరించుకోవాలంటే తులసిమాలను ధరించాలి. స్నానం చేయాలంటే స్వామిపుష్కరిణిలో స్నానం చేయండి అని అంటున్నారు ఆళ్వారులు. పరమ కృపామూర్తి అయిన శ్రియఃపతి శ్రీ పాదాలను స్తుతించడమే జిహ్వకు తగిన ప్రయోజనం. వేంగైపూలదివ్యసుగంధముచేత వ్యాప్తమైనదివేంకటాచలం. అందమైన వేణువును అధరంలో పెట్టుకుని ఊదినశ్రీ కృష్ణుడు నివసించే పర్వతం వేంకటాచలం..


తిరుమలై అని వేంకటాచలాన్ని పిలిచింది. వేంకటాచల సౌందర్యాన్ని. వేంకటేశ్వరుణ్ణి హరిహరాత్మకంగా దర్శించింది. ఆళ్వారే. ఈ పేరే నేటికీ తిరుమల అని వ్యవహరింపబడుతోంది. గోవింద నామాన్ని నా హృదయంలో లిఖించి, అద్భుతమైన వేంకటేశ్వరుడను దివ్యజ్యోతిని నేను చేరేటట్లు నన్ను అనుగ్రహించమని వేడుకొంటోంది ఆండాళ్. భగవానునికి ఏ ఆటంకం లేకుండా కైంకర్యం చేసే ఉపాయంశ్రీ నీవాసునికి నమః అని అనడమే. ఇది పరమ సులభమైన ఉపాయం. దీనిని అందరూ అనుష్టించవచ్చు. ఈ నమోవాకాన్ని పల్కితే మన ప్రాక్తన కర్మలను, ఆగామి కర్మలను సమూలంగా నాశనం చేస్తాడు. ఈ ఫలాన్ని మనకు వేంకటాచలమే ఇవ్వగలదు. శ్రీ వేంకటాచలస్వామి పాదాలను మోస్తూ లక్ష్మీసహితుడై ఆ పర్వతము మన మనోరథాలను ఈడేరుస్తుంది. తిరుమలకు నమస్కరిస్తే చాలు, మన బాధలన్నీ తమంతట తామే తీరిపోతాయి. తిరుమలలో స్వామి గోవిందనామంతో ప్రసిద్దుడు.


శ్రీ వారి పాదారవిందాలను మనస్సులో కీర్తించి ధ్యానించేవారికి సంసారంలోని సకల బాధలను, వార్ధక్యాన్ని, చావు పుట్టుకలను, వ్యాధులను లేకుండా చేస్తాడు స్వామి. ఇటువంటి మహిమ తిరుమల సంబంధం వల్లనే కలిగింది. అందుకే మనకు ఈ తిరుమల ప్రాప్యం. అందుకే తిరుమలకు పోయి స్వామిని సేవించడం. తిరుమలలో సర్వదేశ, సర్వకాల సర్వావస్థలలోనూ భగవానునికి అన్నివిధాల కైంకర్యాలను చేయాలని, లోకాలను రక్షించు తండ్రిని సదా స్తుతించి, తరించాలని స్వామీ! నీ శ్రీ పాదాలను నేను చేరేదారినికృపతో నాకు అనుగ్రహించు తండ్రీ అంటూ ఆళ్వార్లు ప్రార్థించారు. నీలమేఘము వంటి దివ్యమంగళ రూపంతో ఆశ్రితులకు అత్యంత సన్నిహితంగా ఉండేశ్రీ నివాసుడు సాటి లేని మేటి కీర్తితో, జగద్రక్షకుడై సర్వవేద ప్రతిపాదుడై వేంకటాచలంలో వేంచేసి ఉన్న స్వామిని కోరుతున్నాను. | తమ దుఃఖాలను, సాధనాంత రాహిత్యాన్ని విన్నవించి, తమ అభీష్టసిద్ధి కోసం శ్రియఃపతి శ్రీ పాదాలను నమ్మి శరణాగతి పొందిన భక్తులెందరో ఉన్నారుశ్రీ రంగనాథునికీ, వేంకటనాథునికీ అభేదం కల్పించడం ఆళ్వార్ల ప్రత్యేకత. సంధ్యాకాల కర్తవ్యం అంటే భగవత్ కైంకర్యం. ఆళ్వార్ల రచనలు భక్తిరస కలశాలు. ఇప్పుడు జరుగుతున్న తిరుమల ఉత్సవాల్లో ఆళ్వారుల పాశురాలను అనుసంధానించడం సంప్రదాయంగా ఉంది.


| విశాలమైన పర్వత పంక్తులు, ఆకాశం వరకు వ్యాపించి ఉన్న శిఖరాలు, కొండల మధ్య నుండి ప్రవహించే సెలయేళ్ళ అందము, త్రుళ్ళిపడే చేపలు, కొండవాగులూ, దివ్యపుష్పములతో పరిమళించు విశాలమైన పూదోటలు, వెదుళ్ళ పొదలు, వేంకటాచల ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానిచూ సి తరించవలసిందే తప్ప వ్రాయటానికి మాటలు చాలవు. వేంకటాచలంపై వెలసి యున్న స్వామి పరమాత్మే. వేదప్రతిపాదుడై వేంకటాద్రిపై వెలశాడు. తిరుమల పైనే ఆయా యుగాల్లో పలు అవతారాలను ధరించాడని వైష్ణవ సిద్ధాంతం వివరిస్తోంది. స్వామి అవతార నక్షత్ర శ్రవణంతో కూడిన ఉత్సవ దినంలోశ్రీ వైష్ణవులు చేసే మంగళాశాసన ధ్వని అంతటా వ్యాపిస్తుంది. పలు దిక్కుల నుండే పలువురు భక్తులు వేంకటాచలానికి వచ్చి సేవిస్తున్నారు. సిరిసంపదలతో వర్థిల్లే తిరుమలను, భక్తుల పాపాలను హరించే వేంకటాచలాన్ని వెంటనే ఆశ్రయించండి అంటూ ఉద్బోధిస్తున్నారు ఆళ్వార్లు.. మహా మహిమాన్వితులైన బ్రహ్మ రుద్రాదులు కూడాశ్రీ స్వామికి ఆరాధనా సామగ్రితో, నీరాజనాన్ని సమర్పించడం కోసం తిరుమలకు విచ్చేస్తారు. వేదం కీర్తించిన రీతిలో నిత్య యౌవనుడైన సర్వేశ్వరుడు సర్వసులభుడై వేంచేసి ఉండేది రమణీయోద్యానాలతో నిండి ఉండే వేంకటే. పరమపద వాసులకూ, నిత్య సూరులకూ పెన్నిధి తిరుమల.


| యధార్థమైన భక్తితో ఆశ్రయించేది, శారీరక దుఃఖాలను తీర్చగలిగింది, దేవతలను రక్షించిన స్వామి నివసించే కొండ వేంకటాచలం.శ్రీ వేంకటేశ్వరునిశ్రీ పాదలకు సేవచేసేవారే పరమపదాన్ని ఏలగలరు. దాస్యభక్తికి నిదర్శనమైన కులశేఖర పెరుమాళ్ స్వామి ముందున్న గడపగా ఉండాలని కోరుకున్న భక్తాగ్రణి. అందువల్లే తిరుమలశ్రీ వారి సన్నిధిలోని గడపకు "కులశేఖరప్పడి" అని పేరొచ్చింది. | అరుదైన మానవజన్మ. క్షత్రియ జన్మ సైతం నాకొద్దు. నీ కైంకర్యానికి తగిన పక్షి జన్మను పొందినా చాలు. స్వామి పుష్కరిణిలో ఒక నీటి కొంగగా ఐనా, చేపగా ఐనా జన్మించి నేను జీవిస్తే చాలు. భగవత్సంబంధం లేని మానవజన్మ కంటే ఆ సంబంధాన్ని కల పక్షి జన్మమేలు. వాగుగా - అడవి ఏరుగా, స్వామి కటాక్షానికి పాత్రమైన చెట్టుగా, ముళ్ళపొదగా జన్మించినా చాలు అంటూ ఆళ్వా పాదాలను వేడుకున్నారు.